వరంగల్, జూన్ 30 : మహిళల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్లాస్టిక్ నిర్మూలనపై ఆర్పీల సమావేశ ం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి 125 మైక్రాన్ల తక్కువ మందం ప్లా స్టిక్పై నిషేధం విధించిందన్నారు. సింగిల్ యాజ్ ప్లాస్టిక్ నిషేధంపై ఆర్పీలు ఇంటింటికీ వెళ్లి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో మహిళలను భాగస్వామ్యం చే యాలన్నారు.
కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను విక్రయించినా, వినియోగించినా కఠి న చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు. డిసెంబర్ 31 వరకు నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. ప్రతి డివిజన్లో ర్యాలీలు, కాలనీ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని చెప్పా రు.
నగరంలో తనిఖీలకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రా జారెడ్డి, డీఎఫ్వో కిశోర్, మెప్మా టీఎంసీ రమేశ్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆర్పీ, సీవో, టీఆర్ఎఫ్, వోబీ లు పాల్గొన్నారు. కాగా, కౌన్సిల్ హాల్లో జరిగిన ఉద్యోగుల పదవీ విరమణ సభలో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన పారిశు ధ్య కార్మికులు రాజమణి, ఎల్లమ్మ, సౌంద ర్య, కొమురయ్య, లక్ష్మి, సుందరమ్మ, మాలన్ బుచ్చయ్యతో పాటు మాతృ సంస్థకు వెళ్లుతున్న డీఎఫ్వో కిశోర్ను సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్, కార్యదర్శి గోల్కోండ శ్రీను, నాయకులు బాకం సంతోష్, రాజారాపు భాస్కర్, బొట్ల రమేశ్, సర్జన్రాజ్, సురేశ్, మహేశ్, మోరె రమేశ్ పాల్గొన్నారు.