హనుమకొండ చౌరస్తా, జూలై 28: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూస్టేడియం(జేఎన్ఎస్)లో రెండు రోజుల పాటు నిర్వహించిన రీజినల్ స్పోర్ట్స్హాస్టల్ సెలక్షన్స్మంగళవారం ముగిశాయి. రాష్ర్టవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 450 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్ విభాగాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ హనుమకొండ రీజినల్ స్పోర్ట్స్హాస్టల్లో అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, రాష్ర్టం నలుమూలల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం స్పోర్ట్స్ హాస్టల్పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
ప్రతిభ ఆధారంగానే ఎంపికలు చేపట్టామని, ఎంపికైన క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందించి రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపికైన క్రీడాకారులకు త్వరలో సమాచారం అందజేస్తామని తెలిపారు. ఎంపికల ప్రక్రియను సాట్ అబ్జర్వర్లు సతీష్రెడ్డి (జిమ్నాస్టిక్స్ కోచ్), దీపక్ప్రసాద్ (హ్యాండ్ బాల్ కోచ్), సుధాకర్యాదవ్ (రెజ్లింగ్ కోచ్), సంతోష్చారి(స్విమ్మింగ్ కోచ్), రాజేష్(అథ్లెటిక్స్ కోచ్) పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు, స్టాఫ్ పాల్గొన్నారు.