ఖిలావరంగల్ : బాలల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన మహిళా, పిల్లలు, దివ్యాంగులు, వమోవృద్ధులు, బాలల పరిరక్షణ, సఖీ సేవలు, ఛైల్డ్ హెల్ఫ్లైన్ విభాగాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల రక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహిరించాలని, మహిళా శిశు సంక్షేమ సిబ్బంది పిల్లలను తమ సొంత పిల్లలుగా భావించి సేవలు చేయలన్నారు.
క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని, మహిళల కోసం పనిచేసే సఖీ కేంద్రం కార్యకలాపాలు జిల్లా అంతట నిర్వహించాలని 0-18 సంవత్సరాల పిల్లల రక్షణలో, బాల్యవివాహాల నిర్మూలణకు పాటుపడాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శిస్తానన్నారు. ఐసీడీఎస్, బాలల పరిరక్షణ, పోషణ అభియాన్, చైల్డ్హెల్ప్లైన్లపై ఆయా అధికారులు, పిపిటి ద్వారా కలెక్టర్కు వివరించారు. కార్యక్రమలో డీడబ్ల్యూవో శారధ, సీడీపీవోలు శ్రీదేవి, రాధిక, విశ్వజ, సూపరింటెండెంట్ లక్ష్మినారాయణ, సూపర్వైజర్స్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.