ములుగు, డిసెంబర్ 16 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర విభజన హామీలో భాగమైన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 4వ తేదీన పా ర్లమెంట్లో గిరిజన యూనివర్సిటీ బి ల్లుకు ఆమోదం లభించింది. కాగా, శనివారం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఉప కులపతి బీజేరావు, రిజిస్ట్రార్ దేవేస్నిగం, డిప్యూటీ రిజిస్ట్రార్ అభిషేక్కుమార్ యూనివర్సిటీకి ములుగులో కేటాయించిన ప్రభుత్వ భూములను పరిశీలించారు. అలాగే తాత్కాలికంగా తరగతులను ప్రారంభించేందుకు ములుగు మండలంలోని జాకారం వైటీసీ భవనాన్ని సందర్శించారు. కాగా, తొలుత కలెక్టర్ ఇలా త్రిపాఠి తన కార్యాలయంలో సెంట్రల్ యూనివర్సిటీ బృం దానికి గిరిజన వర్సిటీ కోసం రాష్ట్ర ప్ర భుత్వం కల్పించిన సదుపాయాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ములుగు తహసీల్దార్ విజయ్భాస్కర్, ఇతర అధికారులతో కలిసి గట్టమ్మ దేవాలయం వద్ద ఉన్న భూములను సభ్యులు పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. 2024-25 విద్యా సంవత్సరంలో తరగతులను ప్రారంభించేందుకు జా కారం వైటీసీ భవనాన్ని పరిశీలించామన్నారు. వారి వెంట జాయింట్ డైరెక్టర్ కల్యాణ్రెడ్డి, డీటీడీవో దేశీరాం ఉన్నారు.