వర్ధన్నపేట, సెప్టెంబర్ 1: వినాయక నవరాత్రోవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని అన్ని గ్రామాలతో పాటుగా వర్ధన్నపేట పట్టణంలో పెద్ద సంఖ్య లో యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట పట్టణంలో పలువురు ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్దకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్థానిక నాయకులతో కలిసి వెళ్లి గణపతి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధ్దలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట: వినాయక చవితి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రెండో రోజూ వినాయకుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ గణేశ్ నవరాత్రోత్సవాలను భక్తులు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు.
కరీమాబాద్లో..
కరీమాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని వాడవాడలా నిర్వాహకులు గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. పలు చోట్ల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
గిర్మాజీపేటలో..
గిర్మాజీపేట: 28వ డివిజన్లోని పిన్నవారివీధిలో ఫ్రెండ్స్ యూనిట్ కమిటీ సభ్యులు 40వ సంవత్సరం చేస్తున్న గణపతినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సువర్ణ కాంప్లెక్స్లో యాదగిరి లక్ష్మీనర్సింహాస్వామి టెంపుల్ సెట్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కార్పొరేటర్ గందె కల్పనా-నవీన్ దంపతులతో పాటు కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ యూనిట్ కమిటీ సభ్యులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కొలిపాక శ్రీనాథ్, గందె శ్రీనాథ్, శ్రీకాంత్, పిన్న శివకుమార్, భార్గవరామ్, కల్యాణ్ బొగల్, బొడ్ల రవీంద్రనాథ్, వినోద్, విజయ్, అనిల్, నాగేందర్, మురళి, వేణు, సుధీర్, వినయ్, అనిల్, తాటికొండ రాము, కరుణాకర్, ఆకుతోట సంజు పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్లోని అండర్రైల్వేగేట్ ప్రాంతంలో భక్తసమాజం కమిటీ అధ్యక్షుడు మిట్ట నిశాంత్, కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు.
గీసుగొండలో..
గీసుగొండ : మండలంలో సుమారు 200 గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రుల సందర్భంగా గ్రామాల్లో పండుగా వాతావరణం నెలకొంది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు సైతం గణపతి వేడుకల్లో పాల్గొంటూ పూజలు చేస్తున్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట : వినాయకుడు వాడవాడలా పూజలు అం దుకుంటున్నారు. వివిధ వ్యాపార, వాణిజ్య, సేవా సంస్థ లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, వాడ ల్లో, కాలనీల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు.
నర్సంపేట రూరల్లో..
నర్సంపేట రూరల్ : మండలంలోని 27 గ్రామాలు, శివారు పల్లెలు, తండాల్లో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని గ్రామాల్లో వినాయకుడు కొలువు దీరారు. వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, భక్తుల సమక్ష్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆది దేవున్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులున్నారు. మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువుకట్ట పైగల శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈత సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈత సంఘం అధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షుడు శింగిరికొండ మాధవశంకర్గుప్తా, విగ్రహ దాత చిదిరాల శరత్, పంబి చంద్రమౌళిల ఆద్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు కొనసాగాయి.
దుగ్గొండిలో..
దుగ్గొండి: మండల కేంద్రంతో పాటు మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో, తండాల్లో, వాడవాడనా గణనాథులు బుధవారం కొలువు దీరారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
రాయపర్తిలో..
రాయపర్తి: మండలంలోని అన్ని గ్రామాల్లో ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయకుడు కొలువుదీరారు. మండలంలోని 39 గ్రామ పంచాయతీల్లో పలు యువజన సంఘాలు, కుల సంఘా లు, విద్యార్థులు, ఉత్సవ సమితీల సారథ్యంలో గణేశ్ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎస్సై బండారి రాజు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సంగెంలో..
సంగెం : మండలంలోని అన్ని గ్రామాల్లో గణపయ్య కొలువుతీరాడు. గణేశ్ మహరాజ్కి జై, జైబోలో ఏకదంతుడికి వంటి నినాదాలతో గణేశ్డి మండపాలు మార్మోగుతున్నాయి. అత్యంత భక్తిశ్రద్ధ్దలతో వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు సంబురంగా జరుపుకుంటున్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట: చెన్నా రావుపేటలోని సిద్దార్థ హై స్కూల్ నందు చైర్మన్ కంది గోపాల్ రెడ్డి మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. మండల కేంద్రంలోని యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి పూజా కార్యక్రమం లో విగ్రహ దాత అయిల్ రెడ్డి, తోట రాముడు, గట్ల రాం బాబు, వీరాచారి, కార్త్తీక్, మంగ రవితేజ, రాంబాబు, వసీం ఆక్రం, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం : మండల వ్యాప్తంగా యువజన సంఘా లు, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. మండల కేంద్రంలో భజరంగ్ యూత్ అసోసియయేషన్ ఆధ్వర్యంలో 101 కేజీల లడ్డును వేలంలో దక్కించుకోవడానికి రూ.101 చెల్లించి భక్తులు పాల్గొనవచ్చని అసోసియేషన్ బాధ్యులు తెలిపారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి: మండలంలోని కాకతీయ బ్రిలియంట్ స్టార్ విద్యాలయంలో కరస్పాండెంట్ కమలాకర్రావు కుటుం బ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.