మడికొండ, ఆగస్టు 14: మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో ఆదివారం సాయంత్రం లైగర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శక త్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ లైగర్ మూవీని నగరంలో వేడుకగా చేపట్టింది. సినిమా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, దర్శకుడు పూరీ, నిర్మాత, హీరోయిన్ చార్మి, ప్రముఖ హాస్య నటుడు అలీతోపాటు చిత్ర తారాగణం పాల్గొన్నది.
ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. ప్రీ రిలీజ్లో చేసిన నృత్యాలు అలరించాయి. పంచా యతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ తదితరులు హాజరయ్యారు. వరంగల్లో సినిమా స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.