వర్ధన్నపేట, మే 15 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని విధిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాక గ్రామాల్లోని వృద్ధులు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకునేలా కూడా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతేకాక తెలంగాణకు పేరు తీసుకుస్తున్న క్రీడాకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. కాగా,క్రీడోత్సవాలను ప్రారంభించిన అనంతరం క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే రమేశ్ వాలీబాల్ ఆట ఆడి వారిని ఉత్సాహపరిచారు. అలాగే, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. పోటీల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు, పీఈటీలకు సూచించారు. జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఆత్మచైర్మన్ గోపాల్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సంపత్రెడ్డి, సర్పంచ్ ఆరెల్లి స్రవంతి, నాయకులు తూళ్ల కుమారస్వామి, చొప్పరి సోమయ్య, అంజన్రావు పాల్గొన్నారు.
హసన్పర్తి : హసన్పర్తిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి పోటీలను ఎమ్మెల్యే అరూరి రమేశ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలస్ధాయిలో మూడు రోజులపాటు పుట్బాల్, కబడ్డి, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్న తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్రెడ్డి, జడ్పీటీసీ సునీత, ఎంపీడీవో రామకృష్ణ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్, ఆత్మ చైర్మన్ చంద్రమోహన్, బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, రెండో డివిజన్ అధ్యక్షుడు జంగ కుమార్యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, మార్కెట్ డైరెక్టర్లు వీసం సురేందర్రెడ్డి, చకిలం రాజేశ్వర్రావు, నాయకులు పిట్టల కుమారస్వామి, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు వల్లాల శ్రీకాంత్, ఏవో విజయలక్ష్మి, పీఏసీఎస్ డైరెక్టర్ కుమారస్వామి, పాల్గొన్నారు. కాగా, మండలంలోని అనంతసాగర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెలిశోజు రాజయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు.