కరీమాబాద్, జనవరి 13: ఉర్సు రంగలీలా మైదానంలోని ఉర్సు బండ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉర్సు రంగలీలా మైదానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. రూ. 15 కోట్లతో ఉర్సు బండ్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అన్ని హంగులతో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామన్నారు.
వాకర్స్కు ఉపయోగపడేలా ట్రాక్తోపాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఉర్సు చెరువు చుట్టూ ఉన్న కట్టపై మొక్కలను పెంచి ట్యాంకుబండ్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. ఉర్సు రంగలీలా మైదానం పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకునేలా పనులు చేపడుతామన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవి, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, 40వ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్, బీఆర్ఎస్ నాయకుడు పోశాల స్వామి పాల్గొన్నారు.
నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
రంగలీలా మైదానం వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవాన్ని రంగలీలా మైదానంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా బొమ్మల్ల అంబేద్కర్, కార్యదర్శిగా సిరంగి రాజ్కుమార్, కోశాధికారిగా కోదాటి శ్యామ్, సహాయ కోశాధికారిగా రణం శ్రీణు, ఉపాధ్యక్షులుగా గుడిమెల్ల మోహన్, పార్వతి కృష్ణంరాజు, బజ్జూరి వాసు, వెలగందుల సదానందం, సహాయ కార్యదర్శిగా కడారి కుమార్, అంకం ప్రవీణ్, బత్తుల రమేశ్, వాసూరి శ్రీను, కన్నబోయిన రవియాదవ్, డైరెక్టర్లుగా కోరె పరశురాం, గుర్రపు కిరణ్, దేవర శ్రీను, శ్రీపతి కుమార్, నరిగె లక్ష్మణ్, దేవర రాజేందర్, కోదాటి శ్రీధర్, గై గోపాల్, అనుమాండ్ల శ్రీను, ఆకుతోట రాజు, గూడూరు మల్లేశం, బైరి నాగరాజు, బత్తిని రంజిత్, బైరగోని మనోహర్, దూవాసి రవి, బిట్ల రమేశ్, జాలివాకర్సగా మాడిశెట్టి శ్రీను, సల్లా కుమార్, నీలం కిరణ్ ప్రమాణం చేశారు.
అనంతరం నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అభినందించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మేడిది మధుసూదన్, గౌరవ సలహాదారులు నాగపురి సంజయ్బాబు, కస్తూరి రాజు, 303 జోనల్ చైర్ పర్సన్ కూనురు వేణుగోపాల్, వంగటి కోటి, కాల్వ అంజయ్య పాల్గొన్నారు.