లక్నవరంలో మునిగి ఇద్దరి మృత్యువాత
ఆరుగురు స్నేహితులు కలిసి
సరదాగా గడిపేందుకు సరస్సు వద్దకు..
అందులో దిగే క్రమంలో గల్లంతు
మృతుల్లో యువతి, యువకుడు
హైదరాబాద్కు చెందిన ఇక్ఫై బిజినెస్ స్కూలు విద్యార్థులుగా గుర్తింపు
గోవిందరావుపేట, మే30: వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని పర్యా టక ప్రాంతానికి వచ్చిన మిత్ర బృందంలో తీరని శోకం మిగిలింది. అంతా కలిసి టూర్ ప్లాన్ చేసు కొని ములుగు జిల్లా గోవింద రావుపేట మండలం లక్నవరం పర్యాటక ప్రాంతానికి చేరుకోగా, అందులో ఇద్దరికి అవే ఆఖరి గడియలుగా మారా యి. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్కు చెందిన ఇక్ఫై బిజినెస్ స్కూల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సోమవారం సాయంత్రం లక్నవరం సరస్సులోని రెండో ఐలాండ్లో ఉన్న కాటేజీని ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారు.
సా యంత్రం వేళలో సరదాగా గడిపేందుకు నీళ్లలోకి దిగారు. ఈ క్రమంలో సాయిప్రీతం(21), తరుణి (20) స్నేహితుల కళ్లముందే నీటముగిపోయి గల్లంతయ్యారు. దీంతో తోటి స్నేహితులు టూరి జం సిబ్బందికి సమాచారం అందించడంతో వా రు పస్రా సీఐ శంకర్, ఎస్సై కరుణార్రావు విష యాన్ని తెలిపారు. హుటాహుటిన సీఐ, ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సా యంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో సాయిప్రీతం, తరుణి మృ త దేహాలను సరస్సు నుంచి ఈతగాళ్లు వెలికి తీశా రు. కాగా, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కార ణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.