ములుగురూరల్, డిసెంబర్ 21 : ములుగు జడ్పీ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ సోదరుడు కుసుమ జయప్రకాశ్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. మల్లంపల్లి గ్రామానికి చెందిన జయప్రకాశ్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం గుండెపోటుకు గురికాగా కుటుంబ సభ్యు లు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన మల్లంపల్లికి తరలించగా గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు ఆయన అభిమానులు మల్లంపల్లికి చేరుకొని భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ములుగు జడ్పీ చైర్మన్గా కొనసాగుతున్న క్రమంలో జగదీ శ్వర్ జూన్లో గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆరు నెలలు గడువకముందే ఆయన సోదరుడు జయప్రకాశ్ సైతం గుండెపోటుతో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.