భూపాలపల్లి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : అంబేద్కర్ క్రీడా మైదానంలో అంబేద్కర్ విగ్రహానికి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ బీ శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ రావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండెల చందర్రావు, ఎస్టీ అసోసియేషన్ బ్రాంచ్ సెక్రటరీ హేమానాయ క్, ఎస్టీ రీజియన్ ఆఫీసర్ రమేశ్, పర్సనల్ ఆఫీసర్ క్రాంతి, శ్రావణ్, అసోసియేషన్ సభ్యులు కృష్ణస్వామి, మండల శ్రీనివాస్, బి దేవ, సంజీవరావు పాల్గొన్నారు.
మహదేవపూర్లో..
మహదేవపూర్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అధికారులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మండల పరిషత్లో ఎంపీపీ బన్సోడ రాణీబాయి, సూరారంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్, ఎంపీడీవో శంకర్నాయక్, ఎంపీవో ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్, బన్సోడ రామారావు, సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రమేశ్, లింగాల రామయ్య, కొయ్యల సత్యం మాదిగ, తూటిచర్ల దుర్గయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
టేకుమట్లలో..
టేకుమట్ల : మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యం లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పండుగ శ్రీను, ఎంపీటీసీ ఆది సునీతారఘు, నాయకులు అరకొండ రాజయ్య, సంగి రవి, అంబాల రమేశ్, ఎలుకటి రాజయ్య, రేణుకుంట్ల రాము, మచ్చ సారయ్య, రాజయ్య, అశోక్, సరోత్తం, కొమురయ్య పాల్గొన్నారు.
మల్హర్లో…
మల్హర్ : మండలంలోని తాడిచర్ల, రుంద్రారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేసారపు నరేశ్ మాదిగ, తాడిచర్ల ఉపసర్పంచ్ ఇందారపు చంద్రయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేసారపు చంద్రయ్య, కుంట సది, బూడిద రాజసమ్మయ్య, జంగం సమ్మయ్య, తుంగపెల్లి తుకారాం, శ్రీకాంత్, ఇందారపు రవి, రాజేందర్, సమ్మయ్య, శ్రీను, రవి, రాజబాబు పాల్గొన్నారు.
కాటారంలో…
కాటారం : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట జనార్దన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఒడిపిలవంచలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కేటీపీపీలో..
గణపురం : మండలంలోని చెల్పూర్ కేటీపీపీలో అంబేద్కర్ వర్ధంతిని కేటీపీపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధాన గేటు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీఈ సిద్ధయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు, ఇంజినీర్లు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు చందన్సింగ్, కుమార్, నర్సయ్య, భూమయ్య, తిరుపతి, లక్ష్మణ్, రాజ్కుమార్, అనిల్, రాజేందర్, రాజు, కోల శ్యాం పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పొట్ల నగేశ్, పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణ చందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలుసాని లక్ష్మీనరసింహారావు, సర్పంచ్ దేవేందర్గౌడ్ పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రవీందర్, సదానందం, దుర్గయ్య, శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్ల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు నేరేళ్ల ఓదెలు పూలమాల వేసి నివాళులర్పించారు. గిద్దెముత్తారంలో సర్పంచ్ పొలవేన పోశాలు, చిట్యాల ఇన్చార్జి సర్పంచ్ ఆకుల రవీందర్, గుర్రపు రాజమౌళి, బుర్ర వెంకటేశ్ గౌడ్, చెక్క నర్సయ్య, గొల్కొండ సురేశ్, కట్కూరి రాజేందర్, గురుకుంట్ల కిరణ్, మాసు రమేశ్ పాల్గొన్నారు.
మొగుళ్లపల్లిలో..
మొగుళ్లపల్లి : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోటే ధర్మారావు, ఉప సర్పంచ్ సరోజనాబాపురావు పాల్గొన్నారు.
అంటరానితనాన్ని రూపుమాపిన వ్యక్తి : డీఈవో
భూపాలపల్లిరూరల్ : అంటరానితనం నిర్మూళనకు తన జీవితాన్ని అంకితం చేశాడని డీఈవో రాజేందర్ అన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈవోలు రఘుపతి, ప్రభాకర్, సురేందర్, ఏఎస్ వో కరుణాకర్, సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, నరేందర్, ట్రస్మా అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, కృష్ణమోహన్, మహేందర్రెడ్డి, మల్లికార్జున్, సరిత పాల్గొన్నారు.
మహనీయుడు అంబేద్కర్
కృష్ణకాలనీ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు అన్నారు. అంబేద్కర్ సెంటర్లో ఉన్న విగ్రహానికి వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పటేల్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించా రు. టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కట కం జనార్దన్ పటేల్, మున్సిపల్ కమిషనర్ అవినాష్, కౌన్సిలర్లు ఆకుదారి మమతారాయమల్లు, నూనె రాజు పటే ల్, మురళీధర్, జక్కం రవికుమార్, బద్ది సమ్మయ్య, సజ్జనపు స్వామి, మంగళపెల్లి తిరుపతి, కో ఆప్షన్ సభ్యురాలు వజ్రమణి, పీఏసీఎస్ డైరెక్టర్ బెడ్డల పోశయ్య, నాయకులు కరాటే శ్రీనివాస్, టీఆర్ఎస్ ఎస్సీసెల్ అర్బన్ కోశాధికారి గోగుల మదన్మోహన్, తిరుపతమ్మ, చింతనిప్పుల వెంకన్న, మైనార్టీ నాయకులు బాబర్పాషా పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్ల ప్రేమ్సాగర్తో ఎమ్మార్పీస్, టీఎస్ ఎమ్మారీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ, బీఎస్పీ, నేతకానీ మహర్ హక్కుల పోరాట సమితి నాయకులు చల్లూరి మధు, కోటేశ్వర్, గుమస్త భూమయ్య, రాజేశం, దుర్గం అశోక్, జాడి అశోక్, దుర్గం రవి, సెగ్గం దినేశ్, మనోహర్, రాజు, కె రాజన్న, అశోక్, శ్యాంకోల, రాంచందర్, నోముల శ్రీనివాస్, పాముకుంట్ల భద్ర య్య, నోములు రాజు, సాగర్, గట్ల రాజన్న పాల్గొన్నారు.
ములుగులో..
ములుగురూరల్ : అంబేద్కర్ వర్ధంతిని జాకారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ప్రిన్సిపాల్ జూలూరి యాదగిరి ఆధ్వర్యం లో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిచ్చిరెడ్డి, శ్రీధర్రావు, సురేశ్బాబు, సత్యం, రాంరెడ్డి, ప్రభాకర్, రామచంద్రం, బాలకృష్ణ, రాజునాయక్, వినోద్కుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా సర్వాపురంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అప్పాజి ఐలయ్య, ఆవుల లక్ష్మీనారాయణ, ప్రశాంత్, శ్రీహరి, ఐలయ్య, రాజు, వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రపంచ మేధావి అంబేద్కర్
ములుగురూరల్ : ప్రపంచ మేధావి, అంబేద్కర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ బైకాని సాగర్, నాయకులు సానికొమ్ము ఆదిరెడ్డి, బైకాని ఓదేలు, గడ్డమీది భాస్కర్, గజ్జి నగేశ్, బల్గూరి నవీన్, నేరేళ్ల శంకర్, కొగిల మహేశ్, రవి, శ్యామల్నాయక్, సంజీవ, చిరంజీవి, రాందాస్ పాల్గొన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కార్త్తీక్, మండల అధ్యక్షుడు రమేశ్, టౌన్ అధ్యక్షుడు రఘువీర్, సాయిమణికాంత్, మనీష్, సంజయ్, కార్తీక్, నవీన్, దీపక్, రాజేందర్ పాల్గొన్నారు.
ఘన నివాళి
ములుగురూరల్: జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్రాంనాయక్, కో ఆప్షన్ సభ్యుడు యూనుస్, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యం లో పాటలు పాడారు. కళాకారులు రాగుల శంకర్, ఈర్ల సాగర్, రహీమొద్దీన్, మార్త రవి, బోడ కిషన్ పాల్గొన్నారు.
ఏటూరునాగారంలో..
ఏటూరునాగారం : తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యం లో బీఆర్. ఫంక్షన్హాలులో జరిగిన వేడుకలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీసీవో సర్దార్సింగ్, రాష్ట్ర కార్యదర్శి గోస్కుల రాంబాబు, నాయకులు రాజమల్ల సుకుమార్, చెన్నూరి బాలరాజు, కిరణ్, బోడ ప్రసాద్ పాల్గొన్నారు. ఆదివాసీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఈసం రామ్మూర్తి, డీఎస్పీ నాయకులు నెగరకంటి సురేశ్, శరత్, చరణ్, శేఖర్, గణపతి,తరుణ్, ఎంఎస్పీ ములుగు ఇన్చార్జి వావిలాల సాంబశివరావు, వావిలాల నర్సింహారావు, వావిలాల స్వామి, వావిలాల నర్సింగారావు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్, కొండగొర్ల రాజేశ్, దేపాక సతీశ్,సత్యం, రవీందర్ పాల్గొన్నారు. రొయ్యూరులో మధుబాబు, మొండయ్య అంకయ్య, రమేశ్, రాంబాబు, లక్ష్మీనారాయణ, బెడిక నరేందర్, జాడి వెంకటేశ్ పాల్గొన్నారు.
మంగపేటలో..
మంగపేట : మండలంలోని కమలాపురం, తిమ్మంపేట, రాజుపేట, అకినేపల్లిమల్లారం గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు, మంగపేటలోని అంబేద్కర్ భవన్ వద్ద ఆయన చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం, ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమలాపురంలో ఎమ్మెల్యే సీతక్క, రామకృష్ణ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేశ్, నాయకులు పరికి శ్రీనివాస్, చిట్టిమల్ల సమ్మయ్య, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, గుమ్మడి సోమయ్య, ముత్యాలు, కాంతారావు, గుగ్గిల్ల సురేశ్, కటికనేని సత్యనారాయణ, ఖుర్బాన్అలీ, పీ సత్యనారాయణాచారి, కాటూరి సుగు ణ, శ్యాంబాబు, మూగల రమేశ్ పాల్గొన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి, డిసెంబర్ 6 : పీఏసీఎస్ కార్యాలయం వద్ద సర్పంచ్ ఇర్సం సునీల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్కుమార్, నాయకులు ముండ్రాతి రాజశ్రీ, కొర్రబెల్లి శేషగిరి, అంబేద్కర్ సం ఘం నాయకులు లక్ష్మణ్, చంద్రయ్య, యువజన సంఘం అధ్యక్షుడు రాము, ఎమ్మార్పీఎస్ నాయకుడు నర్సయ్య, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, లచ్చుపటేల్ పాల్గొన్నారు. కాల్వపల్లిలో అంబేద్కర్ వారసుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వెంకటాపూర్లో..
వెంకటాపూర్, డిసెంబర్ 6 : మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం జనగాం బాబురావు ఆధ్వర్యంలో, లక్ష్మిదేవిపేటలో గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో, ఎంఎస్పీ ఆధ్వర్యంలో అంబేంద్కర్ వర్ధంతిని నిర్వహించారు. గ్రంథాలయ అధ్యక్షులు బీరెల్లి మనోజ్, ఎంఎస్పీ మండల ఇన్చార్జి కాడపాక శ్యాం, మహేందర్, రాజయ్య, అశోక్, రమేశ్, శ్రీను, సంపత్, తిరుపతి, శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వెంకటాపురం(నూగూరు)లో..
వెంకటాపురం(నూగూరు): మండల కేంద్రంలో నిర్వహించిన వర్ధంతిలో ఎంపీపీ చెరుకూరి సతీశ్ కుమార్, ఎంపీడీవో అడూరి బాబు, ఏపీవో భవాని, ఆలుబాక సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, దేవ, నాగేశ్వర్రావు, ప్రసాద్ పాల్గొన్నారు.
ఎంఈవో కార్యాలయంలో ..
వాజేడు : మండల విద్యాశాఖ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంఈవో టీ వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలాజీ, జవహర్లాల్ నాయక్, సీఆర్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వాజేడులో..
వాజేడు : మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహం ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ తల్లడి ఆదినారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారి వెంకటేశ్వర్లు, గ్రామస్తులు విక్రాంత్, అరికిల్ల వేణుబాబు, చెన్నం ఆదినారాయణ, సతీశ్, ఎల్ల య్య పాల్గొన్నారు.