గిర్మాజీపేట/ సంగెం, సెప్టెంబర్ 1: రాష్ట్రస్థాయిలో బెస్ట్టీచర్లుగా జిల్లా నుంచి ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారని ఇన్చార్జి డీఈవో రంగయ్యనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన ఇద్దరు బయోసైన్స్ నుంచి ఎంపికవ్వడం గమనార్హం అని అభినందించారు. జిల్లాలోని సంగెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయాలాజికల్సైన్స్ బోధించే కౌటం ధనలక్ష్మి ఎంపికయ్యారు. గతంలో ధనలక్ష్మి చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యాయి. తను చేసిన ప్రయోగం ఎస్సీఈఆర్టీ వారు ప్రచురించే ‘ఎడ్యుచ్యూర్’ మాసపత్రికలో పబ్లిష్ అయింది. అలాగే, ఖిలావరంగల్ మండలంలోని బొల్లికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ బోధించే చల్లా కృష్ణ అనే మరొక టీచర్ కూడా రాష్ట్రస్థాయిలో బెస్ట్టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. కృష్ణ రాష్ట్ర జీవశాస్త్ర రిసోర్స్పర్సన్గా, వివిధ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో మాస్టర్ట్రైనీగా , పాఠ్యపుస్తకాలకు సంబంధిత వర్క్షాప్లో భాగస్వాములయ్యారు. జిల్లా నుంచి ఇద్దరు టీచర్లు రాష్ట్రస్థాయిలో ఎంపికకావడంపై తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి.