హనుమకొండచౌరస్తా, నవంబర్ 2: దేశమంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణలో అందజేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని ప్రజలు కావాలంటున్నారని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని ఇందిరానగర్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురిచేశాయని, తెలంగాణ ప్రజలను వంచించడానికి, దగా చేసేందుకు ఆయా పార్టీల నేతలు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే మోసపూరిత ప్రకటనలు కర్ణాటకలో చేసి, మళ్లీ ఇక్కడకు వస్తున్నారని, ప్రజలు నిలదీయాలని కోరారు. మూడోసారి కేసీఆర్ సీఎం అయిన వెంటనే ప్రతి కుటుంబానికి బీమా పథకాన్ని వర్తింపజేస్తారన్నారు. 8, 9 డివిజన్లలో చేరికలు చూసిన తర్వాత తనకు విశ్వాసం, ధైర్యం వచ్చిందన్నారు. ఇందిరానగర్లో కమ్యూనిటీ హాల్ కబ్జాకు గురికాకుండా 900 గజాల్లో రూ. 55 లక్షలతో అంబేద్కర్ భవన్ నిర్మిస్తామన్నారు.
ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యకర్తల కష్టాల్లో పాలుపంచుకుంటానని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఇచ్చారు. గతంలో కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీ అందించేందుకు పశ్చిమ ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. కాగా, జంపాల నీరజ్ ఆధ్వర్యంలో 9వ డివిజన్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రణయ్, సన్నీ, సాయిచరణ్, ప్రభాస్, ప్రవీణ్, ధీరజ్, సాయికృష్ణ, పవన్, గణేశ్, ప్రశాంత్, సతీశ్, తరుణ్, సాయిచంద్, 8వ డివిజన్ నుంచి అహ్మద్, రాంచరణ్, సాజిద్, అసీఫ్ అమన్, రియాజ్, ఇబ్రహీం, శ్రీకాంత్, రాజు, జగదీశ్, అలాగే, లక్కాకుల కుమార్, లింగాల నరేశ్, చాడ వెంకటేశ్ నాయకత్వంలో కత్తి రాజు, శివ, ప్రకాశ్, సందీప్, వీరన్న, సతీశ్, రాము, శ్రీనివాస్ చేరారు. వారికి వినయ్భాస్కర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తాళ్ల జనార్దన్గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, నాయకులు చీకటి ఆనంద్, నలుబోలు సతీశ్, బీఆర్ఎస్వీ 8వ డివిజన్ అధ్యక్షుడు నలుబోలు కార్తీక్, మల్లాడి ప్రభాకర్రెడ్డి, ఉడతల సారంగపాణి, కొత్తూరు జాక్ కన్వీనర్ తాడిశెట్టి, కూచన సునీల్, అనురాం, శ్రీనివాస్, సిరిమల్లె సదానందం, తుల రమేశ్ పాల్గొన్నారు.
హనుమకొండ, నవంబర్ 2 : తనను గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండలోని చిరు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో అశోకా జంక్షన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు చిరు వ్యాపారులంతా కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాసర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అన్నివర్గాల ప్రజలు ఉన్నారన్నారు. వీధి వ్యాపారులు కూడా అధికంగా ఉన్నారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో చిరు వ్యాపారులను ట్రాఫిక్, మున్సిపాలిటీ వాళ్లు అనేక ఇబ్బందులకు గురి చేసేవారన్నారు. కానీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్నామన్నారు. ట్రాఫిక్, మున్సిపాలిటీ అధికారుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. వ్యాపారులంతా కలిసి నిబద్ధతతో పనిచేస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు చిరువ్యాపారులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఒకొకరు ఒక్కో వినయ్ భాసర్, కేసీఆర్ లాగా ప్రచారం చేసి, బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. మైనార్టీ బంధు, బీసీ బంధు, దళిత బంధు లాంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు రూ.3 వేల భృతి అందించనున్నట్లు తెలిపారు.
వీధి వ్యాపారులు, కార్మికులకు అండగా మే నెలలో కార్మిక మాసోత్సవాన్ని నెలరోజుల పాటు నిర్వహించామని తెలిపారు. వారి పిల్లల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాగా, సమావేశంలో మౌనిక అనే పీజీ విద్యార్థిని తాను చిరు వ్యాపారం చేసుకోవడానికి వినయ్భాసర్ ఎంతగానో సహాయ సహకారాలు అందించారన్నారు. సునీత అనే మహిళ మాట్లాడుతూ తన కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు చీఫ్విప్ వెన్నంటి ఉండి, ఆదుకున్నారన్నారు. కొడుకు మెడిసిన్ సీటు వస్తే ఆర్థికంగా సాయం చేశారన్నారు. కన్న తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఆదుకోలేదని, కానీ ఒకేసారి సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్తే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని కన్నీటి పర్యంతమయ్యారు. ఖాసీం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు ఖుద్ధుస్, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సత్తార్, ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్, నాయకులు హరిచంద్రు, రాహుల్, సర్వర్, వెంకన్న మంచి రోజు నామినేషన్ వేస్తా.. హనుమకొండ: శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఓ మంచి రోజు చూసుకొని నామినేషన్ వేస్తానని తెలిపారు. శుక్రవారం భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం పండితులను అడిగి 8,9,10 తేదీల్లో నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ వేసే ముందు భద్రకాళీ అమ్మవారితోపాటు వడ్డేపల్లిలోని పోచమ్మ తల్లిని దర్శించుకోనున్నట్లు వినయ్భాస్కర్ వివరించారు.