మడికొండ, జనవరి 3 : ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడాలని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సూచించారు. మడికొండలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.21లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న ‘మన ఊరు-మన బడి ’ పనులను మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్జేడి సత్యనారాయణరెడ్డి, డీఈవో అబ్దుల్ హైతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి, చదును చేయాలని సూచించారు. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈవో రాంకిషన్రాజు, ప్రైమరీ హెచ్ఎం మల్లారెడ్డి, హెచ్ఎం సంధ్యారాణి, ఏఈ ఉదయ్ కుమార్, సీఆర్పీలు రేణుక, రాంప్రసాద్, పీఆర్టీయూ నాయకులు మన్నె చంద్రయ్య, కోమల్రెడ్డి, మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..
హసన్పర్తి : ప్రవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని టీఈఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. గ్రేటర్ రెండో డివిజన్ వంగపహాడ్, 65 డివిజన్ దేవన్నపేటలోని ఎంపీపీఎస్ పాఠశాలలను మంగళవారం పరిశీలించారు. రవీందర్, ఏఈ కృష్ణకుమార్, ఎంఈవో రామకిషన్రాజు, కన్వీనర్ దోమ కుమార్, హెచ్ఎంలు అరుణకుమారి, శోభారాణి పాల్గొన్నారు.
పనులను వేగవంతంగా చేపట్టాలి
కాజీపేట : పట్టణం 62వ డివిజన్ సోమిడిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ – మన బడి’ పథకం ద్వారా జరుగుతున్న పనులను టీఈఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. సోమిడి ప్రాథమిక పాఠశాలలో రూ. 21 లక్షల వ్యయంతో పనులు చేపట్టామన్నారు. పనులను నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, హెచ్ఎంలు బల్ల సతీష్కుమార్, నెహ్రూ, ఏఈ ఉదయ్కుమార్, కాంట్రాక్టర్ సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.