వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 27 : ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులుపోయి, మనం పోదాం బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే రోజులు వచ్చాయి. ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యల మూలంగా ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందనడానికి సన ఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. గత జనవరి 16న సంక్రాంతి పండుగ రోజు హనుమకొండ మచిలీబజార్లో ఆనందంగా గాలిపటం ఎగరేస్తూ ఎండీ సన(6) విద్యుత్ షాక్కు గురై శరీరం 50 శాతం కాలిపోయింది. బాధితురాలిని తల్లిదండ్రులు ఎంజీఎం దవాఖానకు తీసుకురాగా అత్యవసర వైద్యవిభాగంలో చికిత్స అందించారు. అనంతరం బర్న్స్ వార్డులో చేర్చిన వైద్యులు సన ప్రా ణాలు కాపాడారు.
100 రోజుల పాటు చికిత్స అందించిన వైద్యు లు సన కుటుంబంలో ఆనందాన్ని నింపారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రంగస్వామి, డాక్టర్ కవిత, డాక్టర్ వి రాజ్ బృందం సనకు మూడు మేజర్, నాలుగు మైనర్ ఆపరేషన్లు నిర్వహించారు. శస్త్రచికిత్సల స మయంలో ఏడు యూని ట్ల రక్తాన్ని అందించారు. సన కోలుకోవడంతో గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ వైద్యులతో మాట్లాడి సన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సన తండ్రి బియాబలి మాట్లాడుతూ ఎంజీఎం వైద్యులు తమ కూతురి ప్రాణాలు నిలిపారన్నారు. తన కూతురి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని డాక్టర్లతో మాట్లాడి వైద్యసేవలు నిరంతం అందేలా పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ మురళి, వైద్యుల బృందం, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.