పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఇప్పటికే పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోగా, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులను పారదోలేందుకు ఈ స్పెషల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక డ్రైవ్ బుధవారం ప్రారంభం కాగా, వారం రోజుల పాటు జరుగనుంది. హనుమకొండ జిల్లాలోని 208 జీపీల్లో మంగళవారం వరకు పారిశుధ్య పనులు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. పల్లెల్లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
హనుమకొండ, మే 21 : పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17న ప్రారంభం కాగా, 23వ తేదీ వరకు గ్రామాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమించారు. రానున్నది వర్షాకాలం కావడంతో పారిశుధ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో వసతులు మెరుగుపడ్డాయి. ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు ఇస్తున్న నిధులతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడుతున్నారు. హనుమకొండ జిల్లాలోని 12 గ్రామీణ ప్రాంత మండలాల పరిధిలో 208 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో సుమారు 1100 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు.
జిల్లాలో నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించారు. జిల్లాకు రూరల్ డెవలప్మెంట్ నుంచి ప్రత్యేక అధికారిని నియమించినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.
పల్లెల్లో వారం రోజుల పాటు చేపట్టాల్సిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్లో రోజు వారీగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను నిర్దేశించారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి, ఆశ వరర్, అంగన్వాడీ వరర్, వీఏవో, వీవో, ఇతర అధికారులు తొలిరోజు బుధవారం గ్రామంలోని అన్ని వాడలు, ఆవాస ప్రాంతాలను సందర్శించి పనులను గుర్తించ్తారు. వీధుల్లోని చెత్తాచెదారం తొలగించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా మొరంతో నింపి చదును చేశారు. గురువారం మురుగు కాల్వలు శుభ్రం చేసి, ఊరి చివరి వరకు పారేవిధంగా ఏర్పాట్లు చేశారు. మురుగు గుంటలను మొరంతో పూడ్చేశారు.
అలాగే కమ్యూనిటీ సోక్ పిట్స్ (సామూహిక ఇంకుడు గుంతలు) నిర్మాణానికి ప్రణాళిక తయారు చేసి, ఈజీఎస్ నిధులతో నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. మూడో రోజు శుక్రవారం డ్రై డే పాటిస్తూ, ఇండ్ల ఆవరణలో ఉపయోగం లేని డబ్బాలు, కుండలు, పాత టైర్లు, కూలర్లలో నీరు నిల్వ లేకుండా చేశారు. అలాగే దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేశారు. మంచినీటి సరఫరా పైపులైన్, గేట్ వాల్వ్ లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేశారు. నల్లా గుంటలను గుర్తించి, తాగునీరు కలుషితం కాకుండా పూడ్చివేశారు.
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటిలో గ్రే వాటర్ నిర్వహణకు కిచెన్ గార్డెన్ ఏర్పాటు, కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మాణంపై వివరించారు. నాలుగో రోజు శనివారం సైడ్ కాల్వలు, మురుగు నీటిపై దోమలు, లార్వా పెరుగకుండా ఉండేందుకు బైటెక్స్, వెంథియాన్ మిశ్రమాన్ని స్ప్రే చేశారు. అవసరం ఉన్న చోట కలుపు నివారణ మందు సైతం పిచికారీ చేశారు. అంతర్గత రహదారుల వెంట పొదలు, ముళ్ల కంపలు, ప్రైవేట్ స్థలాల్లో చెత్తాచెదారం తొలగించారు. అన్ని ఇండ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుకలోకి తీసుకురావడంతో పాటు అర్హులైన వారికి మంజూరు చేసి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు.
అలాగే ఒక గుంత కల్గిన టాయిలెట్ల(సింగిల్ పిట్)ను రెండు గుంతల (ట్విన్ పిట్) టాయిలెట్లుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఐదో రోజు ఆదివారం ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకునేలా అవగాహన కల్పించారు. నర్సరీలో కలుపుతీత, మొకల సంరక్షణ మందులు పిచికారీ చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ మొకలకు ఫెన్సింగ్, పాదుల వంటి కార్యక్రమాలు చేపట్టారు. వైకుంఠధామంలో పిచ్చి మొకలు, ముళ్ల పొదలు, చెత్తా చెదారం తొలిగించారు.
ఆరో రోజు సోమవారం పాత, నిరుపయోగంగా ఉన్న బావులు, బోర్వెల్స్ను పూడ్చి వేస్తారు. అలాగే శిథిలావస్థలో నిరుపయోగంగా ఉన్న ఇండ్లను తొలగింగించేందుకు చర్యలు తీసుకొంటారు. పబ్లిక్ నల్లాలు, చేతి పంపులకు ప్లాట్ఫాంలు నిర్మించి నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేస్తారు. అదే విధంగా మంచినీటి సరఫరా బావులు, చేద బావుల చుట్టూ, మంచినీటి సరఫరా బోర్ల చుట్టూ మురుగు నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటారు. గ్రామస్తులకు ఇంటి బయట చెత్త వేయొద్దని అవగాహన కల్పించడంతో పాటు చెత్త వేసిన వారికి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం రూ. 500 జరిమానా విధిస్తామని వివరించనున్నారు. చివరి రోజు 23వ తేదీ మంగళవారం ప్రత్యేక డ్రైవ్లో ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే పూర్తి చేస్తారు.