వరంగల్,నవంబర్ 22 : గ్రేటర్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం బాలసముద్రంలోని క్వాలి టీ కంట్రోల్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభివృద్ధి పనుల నాణ్యత పరిశీలించే పక్రియను ఆమె చూశారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో లీకేజీలను అరికట్టే పనులను యుద్ధ్దప్రాతిపదికన చేపట్టాలని కోరారు. రోజు కనీసం ఐదు లీకేజీలకు మరమ్మతు చేసేలా ప్రణాళికలు చేసుకుని ముందుకుపోవాలన్నారు. లీకేజీల మరమ్మతు కోసం టెండర్ పొంది న కాంట్రాక్టర్ను సమన్వయం చేసుకుం టూ ఎప్పటికప్పుడు లీకేజీలను అరికట్టాలని సూచించారు. సమావేశంలో బల్దియా ఈఈలు రాజయ్య, సంజయ్కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
జాతీయ ఆయుర్వేద దినోత్సవం
హనుమకొండ చౌరస్తా : జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురసరించుకుని హనుమకొండ కాకాజీకాలనీలో ఏర్పాటు చేసిన ఆయుష్ వేద వైద్యం ఆల్టర్నేటివ్(ఏవీవీఏ) వైద్య విద్య సంభాష గృహ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి-ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భగవాన్ ధన్వంతరి జయంతిని పు రసరించుకుని సమాజ శ్రేయస్సు కోసం హోమం నిర్వహించడం అభినందనీయమన్నారు. భావితరాలు ఆయుర్వేద వైద్యంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన సీఈవో చిలువేరు రవీందర్, ఆయుర్వేద డాక్టర్ సురేశ్, రిటైర్డ్ ఏడీ డాక్టర్ సుధారాణి, తెలంగాణ ప్రభుత్వ ఇండియన్ మెడిసిన్ ఫార్మసీ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ జఖోటియా, రిటైర్డ్ ఆర్డీడీ డాక్టర్ జీవనాథం, ఆయుర్వేద విద్యార్థులు పాల్గొన్నారు.