పోచమ్మమైదాన్, మార్చి 18 : తాను రాయాల్సిన పరీక్ష సెంటర్కు బదులు మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థినిని గుర్తించిన మట్టెవాడ పోలీసులు సమయానికి బాలికను సెంటర్కు చేర్చారు. వరంగల్ రామన్నపేటకు చెందిన సిలువేరు హనీ పదో తరగతి పరీక్ష రాసేందుకు బ్యాంక్కాలనీలోని ఎస్సార్ హైస్కూల్కు వెళ్లింది. అయితే, ఆమె పాఠక్ మహల్లోని సెంటర్లో రాయాల్సి ఉంది.
పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉండడంతో ఆందోళనకు గురైంది. అక్కడే విధుల్లో ఉన్న మట్టెవాడ సీఐ తుమ్మ గోపి వెంటనే తమ వాహనంలో బాలికను ఎక్కించుకొని పరీక్ష సెంటర్కు తీసుకెళ్లారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చడంతో బాలిక తల్లిదండ్రులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.