హనుమకొండ చౌరస్తా, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలంపిక్ డే రన్ నిర్వహించారు. అనంతరం జేఎన్ఎస్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. జేఎన్ఎస్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒకరూ రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. క్రీడాకారులకు టీషర్ట్స్ ప్రదానం చేశారు.
ఘనంగా హ్యాండ్బాల్ డే వేడుకలు..
అంతర్జాతీయ హ్యాండ్బాల్ డే వేడుకలను జేఎన్ఎస్లోని హ్యాండ్బాల్ కోర్టులో నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామల పవన్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం కేక్ కట్ చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్, ప్రధాన కార్యదర్శి బైరబోయిన కైలాశ్యాదవ్, ఎర్రబెల్లి వరదారెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, రిటైర్డ్ ఐపీఎస్ నాగరాజు, 62, 63వ డివిజన్ కార్పొరేటర్లు జకుల రవీందర్యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, గుర్రపు కోటేశ్వర్, బోయిన కుమార్యాదవ్, హనుమకొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిపాక గణేశ్, సందేల విజయ్కుమార్, మహేందర్రెడ్డి, కాసర్ల నగేశ్, రాజు, దొంగల కుమార్, రాజిరెడ్డి, సత్యవరం మధుకర్ పాల్గొన్నారు.
కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటా
హనుమకొండ, జూన్ 23 : కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఎల్ట్రానిక్స్ ఎంప్లాయ్ నల్ల అవినాష్కు కార్మిక శాఖ ద్వారా వచ్చిన మ్యారేజ్ బెనిఫిట్ను శుక్రవారం చీఫ్ విప్ అందజేశారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ మండలి ద్వారా అనేక మందికి లబ్ధి చేకూరిందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గం పరిధిలో సుమారు 20వేల మందికి లేబర్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 9వేల మందికి వివిధ స్కీంల ద్వారా లబ్ధి చేకూరిందని చీఫ్ విప్ తెలిపారు.
కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. భవన నిర్మాణం, దాని అనుబంధ 54 రకాల కార్మికులకు సభ్యత్వ నమోదు అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్మికులందరూ తప్పకుండా భవన నిర్మాణ సంక్షేమ మండలిలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు. తన జీవితాంతం కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటానని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పుల్ల శ్రీనివాస్, ప్రవీణ్, లేబర్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి కేశోజు ప్రణయ్, సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.