నర్సంపేటరూరల్/వర్ధన్నపేట/ఖానాపురం, జనవరి 26: జిల్లాలో 74వ గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలను ఎగురవేశారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు జాతీయ నేతల వేషధారణలో సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నర్సంపేటలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సంపత్రావు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటస్వామి, పోలీస్స్టేషన్లో టౌన్ సీఐ పులి రమేశ్గౌడ్, ఏరియా దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, శాఖ గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అలాగే, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ వాసం రామ్మూర్తి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఓరుగంటి ఇంద్రసేనారెడ్డి, ఆదర్శ మండల సమాఖ్యలో ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్, బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, లక్నేపల్లి బిట్స్ కళాశాలలో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్రెడ్డి, భాంజీపేట పీహెచ్సీలో వైద్యాధికారి అరుణ్చంద్ర, పశువైద్యశాలలో వెటర్నరీ అధికారి వింద్యతోపాటు పీఏసీఎస్ల్లో చైర్మన్లు, జీపీల్లో సర్పంచ్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. వర్ధన్నపేట తహసీల్లో తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అరుణ, కమిషనర్ రవీందర్, పోలీస్స్టేషన్లో ఏసీపీ శ్రీనివాసరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఖానాపురం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జూలూరి సుభాషిణి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సుమనావాణి, సొసైటీ కార్యాలయంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, వెటర్నరీ దవాఖానలో వైద్యాధికారి శ్రీలక్ష్మి, పీహెచ్సీలో వైద్యాధికారి భూపేశ్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సుధాకర్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్యతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట/దుగ్గొండి/రాయపర్తి/గీసుగొండ: చెన్నారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఈగల భారతి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బన్సీలాల్, పోలీస్స్టేషన్లో ఎస్సై తోట మహేందర్, చెన్నారావుపేట జీపీలో సర్పంచ్ కుండె మల్లయ్య, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ సత్యనారాయణ, బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, కేజీబీవీలో ప్రత్యేక అధికారి జ్యోతి జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎంపీపీ విజేందర్, మండల కో ఆప్షన్ గఫార్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంపత్కుమార్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్సై నవీన్కుమార్, ఏవో దయాకర్, ఏపీఎం రాజ్కుమార్, వైద్యాధికారులు రామ్మోహన్, బాలాజీ, శారద, విద్యుత్ ఏఈలు సురేశ్, మందపల్లి, మహ్మదాపురం, నాచినపల్లి పీఏసీఎస్ల్లో చైర్మన్లు, గిర్నిబావి ఎంజేపీటీలో ప్రిన్సిపాల్ దేవేందర్ ఆదర్శ స్కూల్లో చైర్మన్ రవి, హెచ్ఎం యుగేంధర్, కేజీబీవీలో ఎస్వో మంజుల, న్యూవిజన్ స్కూల్లో చైర్మన్ నర్సింహారెడ్డి, హెచ్ఎం మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షడు సుకినె రాజేశ్వర్రావు జీపీలో సర్పంచ్లు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. రాయపర్తి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, పోలీస్స్టేషన్లో ఎస్సై బండారి రాజు, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం పులుసు అశోక్కుమార్, పీఏసీఎస్లో చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, జడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం అజ్మీరా ఉమాదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ జయకుమారి, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవో నోముల రంగయ్య, పీహెచ్ఎసీలో వైద్యాధికారి భూక్యా వెంకటేశ్, ఆయుష్ వైద్యాలయంలో వైద్యాధికారి రవికుమార్, పశు వైద్యశాలలో డాక్టర్ వీరగోని శ్రుతి, శాఖా గ్రంథాలయంలో గ్రంథపాలకుడు అమీనానాయక్, బీసీ హాస్టల్లో వార్డెన్ జయ, కేజీబీవీలో ప్రిన్సిపాల్ బూర కవిత, అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జీపీలో సర్పంచ్ గారె నర్సయ్య జాతీయ జెండాలను ఆవిష్కరించారు. వేడుకల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ/సంగెం/పర్వతగిరి/చెన్నారావుపేట/గీసుగొండ: గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ డీఎస్ వెంకన్న, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ మారం రాము, జీపీలో సర్పంచ్ సొంటిరెడ్డి యమున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో ప్రవీణ్, డీటీ రాజ్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, ఎంపీటీసీ కరిష్మా, గ్రామాల్లో సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. గౌతమి విద్యా నికేతన్లో పిల్లల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కొమురయ్య, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరావు, పోలీస్స్టేషన్లో ఎస్సై పెండ్యాల దేవేందర్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో యాకయ్య, పీహెచ్సీలో డాక్టర్ అశోక్, పశువైద్యశాలలో డాక్టర్ రాజు, ఐకేపీ కార్యాలయంలో కిషన్, కేజీబీవీలో నీలిమ, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ రెహమాన్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీకాంత్రెడ్డి, గ్రామాల్లో సర్పంచ్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కాగా, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని 98 శాతం విజయవంతంగా పూర్తి చేసిన రాంచంద్రాపురం బీఎల్వో తీగారపు రజితకు ఉత్తమ బీఎల్వో అవార్డును తహసీల్దార్ రాజేశ్వరావు అందజేశారు. పర్వతగిరి తహసీల్దార్ కోమీ, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, ఏవో ప్రశాంత్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, గొర్రె దేవేందర్, సర్పంచ్లు ఆయా కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరించారు. గీసుగొండ మండలవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీవో రమేశ్, తహసీల్దార్ విశ్వనారాయణ, సీఐ రాజు, వైద్యాధికారి మాధవీలత, పశువైద్యుడు రమేశ్ ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గ్రేటర్ వరంగల్ 15, 16 డివిజన్లో మున్సిపల్ అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సౌజన్య, ఎంపీవో ప్రభాకర్, కార్పొరేటర్ మనోహర్, మనీషా, ఏఈవోలు విజయ్, కావ్య, హుస్సేన్ పాల్గొన్నారు.