కళాశాల చైర్మన్ తిరుమల్రావు
హసన్పర్తి, జూన్ 17 : బెంగళూరుకు చెందిన పెంటగాన్ స్పేస్ (ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ నిర్వహించిన ఆన్లైన్ ప్లేస్మెంట్ డ్రైవ్లో భీమారంలోని ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 17 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్రావు శుక్రవారం తెలిపారు. బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న 11 మంది విద్యార్థులు, ఈఈఈ నుంచి ఆరుగురు విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ఆయన పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుమల్రావు కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్స్ను తిరుమల్రావు అందజేసి అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బీ రఘు, డైరెక్టర్ ఏకే రాథోడ్, ప్లేస్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ కుమారస్వామి, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.