నల్లబెల్లి, నవంబర్ 22 : విద్యార్థులు ఉన్నత చదువులు చదివి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంపీపీ ఊడుగుల సునిత సూచించారు. నల్లబెల్లి జడ్పీహెచ్ఎస్లో చెకుముకి సైన్స్ టాలెంట్ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు మంగళవారం ప్రదానం చేశారు. ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సహకారంతో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మండల నోడల్ అధికారి ఎం.రామస్వామి, వైస్ ఎంపీపీ గందె శ్రీలతా శ్రీనివాస్, చెకుముకి నిర్వహణ బాధ్యులు ఎండీ రాయబోస్, రాము, సంతోశ్కుమార్, ఉపాధ్యాయులు సుధాకర్, కిరణ్ పాల్గొన్నారు.
నెక్కొండ: చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్లో నెక్కొండ గౌతమి విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు టాపర్గా నిలిచారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ టెస్ట్లో విద్యార్థులు బి.వరప్రసాద్, బి.సహజల్ యోధన్ శాస్త్రి, ఎం.సాహితి ప్రతిభచాటారు. విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ అనంతుల మురళీధర్, ప్రిన్సిపాల్ కల్పన ప్రశంసాపత్రాలను అందించారు. గైడ్ టీచర్లు మధుకర్రెడ్డి, అజయ్కుమార్, దయాకర్, టాలెంట్ టెస్ట్ మండల కన్వీనర్ బూరుగుపల్లి శ్రవణ్కుమార్, నెక్కొండ హైస్కూల్ హెచ్ఎం రంగారావు, పెద్ద కోర్పోలు హైస్కూల్ హెచ్ఎం విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
పర్వతగిరి: చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్లో మండలంలోని చింతనెక్కొండకు చెందిన విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థులు తంగెళ్ల చరణ్తేజ్, కీర్తి సాయిచంద్, పస్తం ప్రతాప్ ప్రతిభ చాటి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ అక్కినపెల్లి సతీశ్ కుమార్ తెలిపారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. కాగా పర్వతగిరి ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు వేదిక కన్వీనర్ పాక శ్రీనివాస్ తెలిపారు. నోడల్ అధికారి గాయపు లింగారెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జలీల్ హాజరయ్యారు.
సంగెం జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు సంగెం మండల విద్యార్థులు ఎంపికైనట్లు ఎంఈవో ఎన్.విజయ్కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈ పోటీలు జరగ్గా ప్రభుత్వ పాఠశాలల విభాగం నుంచి జడ్పీ హెచ్ఎస్ కాపులకనపర్తి విద్యార్థిని ఎన్.రక్షిత, ఇంగ్లిష్ మీడియం విభాగంలో మొండ్రాయి విద్యార్థులు ఎం.తరుణ్, ఎన్.హన్సిక, ఇ.మనస్విని, పాఠశాలల విభాగంలో ఇ.రక్షక్, కె.ప్రణీత, జీ.కార్తీక్ విజేతలుగా నిలిచి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు ఎంఈఓ వివరించారు.