తొర్రూరు, జనవరి 26: రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతున్నదని, రాజ్యాంగ ఆశయాలు, స్ఫూర్తిని ప్రతి ఒకరూ కొనసాగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 100 అడుగుల జాతీయ పతాక కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో 100 అడుగుల జాతీయ పతాక వేదిక వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. తొలిసారి తొర్రూరు జామా మసీదు ఎదురుగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ముస్లింలతో కలిసి ఎగురవేశారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలిసి బీఆర్ అంబేదర్, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణలో అతి తకువ కాలంలోనే అభివృద్ధి, సంక్షేమం ఉరకలేస్తున్నదని, దేశ ప్రజల దృష్టి ఇప్పుడు తెలంగాణ వైపు మళ్లిందన్నారు. మోదీ రిటైల్ రంగాన్ని అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి చిన్న వ్యాపారులకు బతుకుదెరువు లేకుండా చేస్తున్నాడని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. ఆర్డీవో రమేశ్, డీఎస్పీ రఘు, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, ఎంపీపీ చిన్నఅంజయ్య, జడ్పీ ఫ్లోర్లీడర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.