అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలను అరికట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ (ఎన్ హెచ్టీఎస్) యాప్ను తీసుకొచ్చింది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం, చిన్నారుల పెరుగుదల, టీకాల పంపిణీ తదితర సేవలను ఇప్పటి వరకు రికా ర్డుల్లో నమోదు చేస్తున్న టీచర్లు ఇకపై ప్రభుత్వం రూపొందించిన యాప్లో పొందుపర్చాల్సి ఉంటుంది. తద్వారా వారిలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని 12 మండలాల్లో 695 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. జనగామ, స్టేషన్ఘన్ పూర్, కొడకండ్ల ప్రాజెక్టుల పరిధిలో కొనసాగుతున్న ఈ సెంటర్లలో సేవలన్నీ ఇక పేపర్లెస్గా మారనున్నాయి.
బచ్చన్నపేట, నవంబర్ 29: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలన్నీ ఇక పేపర్లెస్గా మారనున్నా యి. ఈ మేరకు ప్రభుత్వం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్(ఎన్హెచ్టీఎస్) యాప్ను రూపొం దించింది. ఇప్పటికే జిల్లాలోని 12 మండలాల్లోని జన గామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ప్రాజెక్టుల పరిధిలో సీడీపీవోలు, సూపర్వైజర్లు, 695 అంగన్వాడీ కేంద్రా ల్లోని ఎంపిక చేసిన బెస్టు టీచర్లకు జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రాజెక్టుల వారీగా సెక్టార్ల పరిధిలో అంగన్వాడీ టీచర్లకు అవగా హన కల్పించేందుకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో 23,251 మంది పిల్లలు, 3127 మంది బాలింతలు, 3208 మంది గర్భిణులు ఉన్నారు.
ఇక వివరాలన్నీ యాప్లోనే..
ఇప్పటి వరకు వివరాలన్నీ రికార్డుల్లో రాసిన అంగ న్వాడీ టీచర్లు ఇక నుంచి ఎన్హెచ్టీఎస్ యాప్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ యాప్తో గర్భిణులు, బాలింతలకు ఒకపూట భోజనం, లబ్ధిదారుల హాజరు శాతం, పిల్లలకు ఇంటికి రేషన్, స్నా క్స్, ఒక పూట భోజనం తదితర వివరాలు యాప్లో నమోదు చేస్తా రు. అంతేకాకుండా చిన్నారుల బరువు, ఎత్తు, కొలత లు తీసి యాప్లో అప్లోడ్ చేసి వారి పో షణ స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. దీని ద్వారా లోప పోషణ పిల్లలపై మరింత పర్యవేక్షణ చేయనున్నారు. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది విధు లు, రికార్డుల నిర్వహణ, సరుకుల పంపి ణీ, చిన్నారుల పెరుగుదల, టీకాల పంపిణీ తెలుసుకునే వీలుంది. టీచర్ల మొబైల్లో ఈ యాప్ను పొందుపర్చారు.
శిక్షణ పూర్తి
ఎన్హెచ్టీఎస్ యాప్కు సంబంధించి జిల్లా కేం ద్రంలో ఇప్పటికే శిక్షణ పూర్తయ్యింది. యాప్ను ఎలా వినియోగించాలో ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజ ర్లు, సెక్టారుకు ఒక బెస్టు అంగన్వాడీ టీచర్ను ఎంపిక చేసి వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. రాబో యే రోజుల్లో ఏ చిన్నారి బరువు తక్కువ ఉండకూ డదని, వారి కోసం ప్రత్యేక పౌష్టికాహారం కూడా ప్రభు త్వం అందించే అవకాశం ఉంది.
పకడ్బందీ పర్యవేక్షణ
యాప్తో పర్యవేక్షణ పెరుగనుంది. తద్వార కేంద్రాల్లో సేవలు లబ్ధిదా రులకు మరింత నాణ్యంగా అందనున్నాయి. రోజు వారీ విధులు, పౌష్టికాహారం, సరుకుల పంపిణీ, రికార్డు ల నిర్వహణ వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధి కారులు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇప్పటికే దీనిపై శిక్షణ ఇచ్చాం. శాఖాపరంగా ఆదేశాలు రాగానే యాప్ను వినియోగంలోకి తెస్తాం.
– జయంతి, జిల్లా మహిళా సంక్షేమాధికారి
ఆన్లైన్లో పర్యవేక్షణ
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు మరిన్ని సే వలందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వె ళ్తోంది. ఎన్హెచ్టీఎస్ యా ప్తో పారదర్శకత పెరుగ నుంది. ఎలాంటి అవకత వకలు జరుగకుండా పర్యవేక్షించే అవకాశం ఉంది.
– కొమ్మాల ఎల్లమ్మ, అంగన్వాడీ టీచర్స్, అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు(టీఆర్ఎస్కేవీ)