మహాదేవపూర్, ఆగస్టు 8: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.