మరిపెడ, జనవరి 19: జాతీయ స్థాయి షటిల్ క్రీడా పోటీలకు మరిపెడ పురపాలిక కేంద్రం వేదిక కావటం సంతోషకరంగా ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురు వారం మున్సిపల్ కేంద్రంలోని ఇండోర్ స్టేడియం అండ్ ఆడిటోరియంలో 14వ విడుత ప్రారంభమైన జాతీయస్థాయి ఓపెన్ టోర్నీని ఆయన ప్రారంభించారు. నిర్వాహకుడు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.3కోట్లతో జాతీయ క్రీడాప్రమాణాలతో సర్వాంగ సుందరంగా ఆడిటోరియం నిర్మించి క్రీడాపోటీల నిర్వహిస్తున్న నవీన్రావును ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ క్రీడాపోటీలకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ నలుమూల జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో పట్టణ కేంద్రాలు మునిసిపాలిటీ కేంద్రాలుగా ఏర్పడి శరవేగంగా ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు. మరిపెడ, డోర్నకల్ పురపాలికలు ఏర్పాటు చేసి రూ.20కోట్ల చొప్పున మంజూరు చేసిన ప్రభుత్వం ముమ్మరమైన ప్రగతి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో రూ.25కోట్ల చొప్పున రెండు పురపాలికలకు రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, ఈ నిధులతో పట్ణణ కేంద్రంలో పారిశుధ్యం, సురక్షితమైన తాగునీళ్ల సరఫరాతో ఆయా కాలనీలు అభివృద్ది పరుస్తామన్నారు.
అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలోని మరిపెడ మున్సిపల్ ప్రగతిపథంలో అదర్శంగా నిలుస్తుందన్నారు. ఇండోర్ స్టేడియంలో టోర్నీ ప్రారంభించిన అనంతరం ఆమె క్రీడకారులను పరిచయం చేసుకున్నారు. ఆడవిడుపుగా షటిల్ ఆడి పలువురిని అలరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్రావు, జిల్లా రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షులు రవిచంద్ర, రామడుగు అచ్యుత్రావు, ఎంపీపీ గుగులోతు అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, డీసీసీబీ డైరక్టర్ చాపల యాదగిరిరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రామసహాయం సత్యనారాయణరెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, సర్పంచ్ల ఫోరం మండ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వరరావు, విసారపు ప్రగతి, పానుగోతు వెంకన్న, కేలోతు వస్రం, మాక్సుద్, హుస్సేన్, మాచర్ల భద్రయ్య, కిషన్నాయక్, రేఖ వెంకటేశ్వర్లు, యాదలపురం అజయ్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు దిగజర్ల శ్రీనివాస్, గోల్కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.