వరంగల్ : నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సినీ నటుడు దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కలిశారు. తాను తీసిన రైతన్న సినిమాని చూడాలని ఎమ్మెల్యేను కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రైతులకు అవగాహన పరచాలనే ఉద్దేశంతోనే రైతన్న సినిమాలో వివరించానని నారాయణ మూర్తి తెలిపారు.
ఈ సినిమా చూసి రైతులకు జరిగే నష్టాన్ని తెలుసుకోవాలని అన్నారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.