బయ్యారం, ఫిబ్రవరి 8 : బయ్యారం మండలం నామాలపాడులో ని ఏకలవ్య పాఠశాలలో మెనూ పాటించకపోవడం లేదు. దీంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 300మంది విద్యభ్యసిస్తున్నారు. ఆరు, ఏడు తరగతుల ఒక్కో విద్యార్థికి నెలకు రూ.900, 8,9,10 తరగతు ల వారికి రూ. 1200 డైట్ చార్జీలను ప్రభుత్వం అందిస్తుంది. వీటితో ఉదయం రాగి మాల్ట్, బూస్ట్తో పాటు టిఫిన్, ఒక రోజు గుడ్డు, మరో రోజు అరటి పండు, వారంలో ఒక రోజు చికెన్ పెట్టాలి. సాయంత్రం పల్లిపట్టి, స్వీట్ వంటి స్నాక్స్, రాత్రి భోజనం లేదా బగారా రైస్ ఇవ్వా ల్సి ఉంది.
అయితే నిర్వాహకులు సరిగ్గా మెనూ పాటించకపోవడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. అంతేకాకుండా కొన్ని సార్లు సరిపడా ఆహారం లేకపోవడంతో అర్ధ్ధాకలితో విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారం రోజుల క్రితం టిఫిన్ సరిపోవడం లేదంటూ విద్యార్థులు ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపకులకు సైతం ఫిర్యాదు చేశారు. తాము పాఠశాలకు వచ్చిన క్రమంలో భోజనం బాగుండడం లేదని, సరిపోవడం లేదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ రవిబాబును వివరణ కోరగా మెనూ విషయంలో హెచ్చుతగ్గులు అవుతున్న మాట వాస్తవమేనని, డైట్ చార్జీలు సరిపోకపోవడంతో సమస్య తలెత్తుతున్నదని తెలిపారు.