నగరంలో బుట్టబొమ్మ పాట ఫేం, సినీ నటి పూజాహెగ్డే శుక్రవారం సందడి చేసింది. హనుమకొండలోని అశోకా జంక్షన్లో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ప్రారంభించింది. వస్ర్తాలను పరిశీలించి, అభిమానులతో ఫొటోలు దిగింది. అనంతరం బీస్ట్ సినిమాలోని హలమితి హబీబో అనే పాటకు స్టెప్పులేసి ఉత్సాహం నింపింది.
– హనుమకొండ చౌరస్తా, మే 12
హనుమకొండ చౌరస్తా, మే 12: నగరంలో సినీ హీరోయిన్ పూజా హెగ్డే సందడి చేసింది. హనుమకొండ అశోకా జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా 30వ షాపింగ్మాల్ను శుక్రవారం ఆమె రిబ్బన్ కట్ చేసి, జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించింది. కుటుంబంలోని అన్ని తరాలవారి అభిరుచులకు సరితూగే వస్ర్తాభరణాలు అత్యుత్తమ ధరలకు ఒకేచోట అందుబాటులో ఉంచడం ఈషోరూం ప్రత్యేకత. షాపింగ్ మాల్లో వైవిధ్యభరితమైన వస్ర్తాలను, చీరలను పరిశీలించిన పూజా హెగ్డే పలువురితో కాసేపు ఫొటోలు దిగారు. ‘వావ్ వరంగల్ బాగుంది..
వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతమంది అభిమానులు ఉంటారనుకోలేదు. ఇక్కడివచ్చిన అభిమానులు అందరికీ ఎంతో థ్యాంక్స్. సౌత్ఇండియా షాపింగ్ మాల్ 30వ షోరూంను ప్రారంభించేందుకు రావడం చాలా ఆనందంగా భావిస్తున్నా’ అంది. సౌత్ఇండియా షాపింగ్మాల్ డైరెక్టర్ సురేశ్ సీర్ణ మాట్లాడుతూ భారతదేశంలోని ఇతర రాష్ర్టాల ప్రధాన నగరాల్లోనూ అతి త్వరలో సౌత్ఇండియా షాపింగ్మాల్ షోరూమ్స్ ప్రారంభిస్తామని చెప్పారు. పురుషులు, మహిళలు, పిల్లల వస్ర్తాలు రూ.150 ఆరంభ ధరలతో లభిస్తున్నాయని, ఆరంభ ఆఫర్గా అన్ని వస్ర్తాలను ‘కాస్ట్-టు-కాస్ట్ సేల్’పై విక్రయిస్తున్నామని చెప్పారు.
డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ సౌత్ఇండియా షాపింగ్మాల్ అత్యంత ప్రత్యేకమైన పట్టు సెక్షన్ గురించి వివరించారు. మరో డైరెక్టర్ రాకేశ్ మాట్లాడుతూ వరంగల్ నగరంలోకెల్లా అతి పెద్ద, అధునాతన నగల విభాగం తమ షోరూంలో ఉందని, అతి తక్కువ తరుగు, మజూరీ చార్జీలు లేని నగలను రాబోయే పెళ్లిళ్ల సీజన్లో కొనుగోలు చేసి ప్రయోజనాన్ని పొందాలని కోరారు. ఇంకో డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ తమ షోరూంలో చుడీదార్లు, లెహంగాలు, లెగ్గింగ్స్, గౌన్లు, కిడ్స్వేర్, లేడీస్ వెస్ట్రన్వేర్, బ్రాండెడ్ లేడీస్వేర్లో లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణమైన కలెక్షన్స్ ఉన్నాయని తెలిపారు.
కాగా, పూజా హెగ్డే అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపింది. ‘హల్మితి హబీబో..’ పాటకు పూజా స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించింది. అభిమానులు హీరోయిన్ను చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పూజా హెగ్డేను సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మేయర్ సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పాల్గొన్నారు.