‘పత్తి పంటలో సస్యరక్షణతో అధిక దిగుబడులు సాధించవచ్చు. సమగ్ర యాజమాన్య విధానా లు పాటిస్తే మేలు. ముందుగా పర్యావరణం దెబ్బతినకుండా పైర్లకు సోకే చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. వాటి వల్ల పంటలకు ఏ విధమైన నష్టం రాకుండా తక్కువ ఖర్చుతో యాంత్రిక, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సేద్యం చేయాలి. ఆ తర్వాత సస్యరక్షణ మందులు వాడి దిగుబడి పెంచుకోవాలి’ అని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
పత్తిలో పురుగుల సహజ శత్రువులను, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, క్రిమిసంహారక పురుగు మందుల వాడకాన్ని, పంట సాగు ఖర్చు తగ్గించేందుకు, చీడ పీడలలో పురుగు మందులను తట్టుకునే శక్తి పెరగకుండా ఉండేందుకు, రసాయనిక పురుగు మందుల వల్ల చనిపోగా మిగిలిన సంతతి వృద్ధి చెందకుండా ఉండేందుకు సస్యరక్షణ చర్యలు దోహదపడతాయి. పత్తి పంటలో ఎకువ వర్షపాతం, మబ్బులతో కూడుకున్న వాతావరణంలో పురుగు ఎకువగా వృద్ధి చెందుతుంది. తొలి దశలో విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారీ చేయకుండా కాండానికి మందు పూసే పద్ధతిని పాటిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వ్యవసా యాధికారులు సూచిస్తున్నారు. పచ్చదోమ ఎకువగా ఉన్నప్పుడు పైరు పెరుగుదల క్షీణించి మొగ్గలు రాక దిగుబడి తగ్గుతుంది. పైరు లేత దశ నుంచి పంటకాలం చివరి వరకు ఈ పురుగు ఆశిస్తుంది. 30,45 రోజుల్లో మోనోక్రోటోఫాస్, నీరు 1,4 నిష్పత్తిలో, 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1.20 నిష్పత్తిలో మొక్క మొదళ్లలో పూయాలి. మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఎసిఫేట్ 75 యస్సీ 1.45 గ్రాములు లేదా ఫ్లేనికామిడ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్లు కలిపి వాడాలి.
రసం పీల్చే పురుగులకు..
ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సమ్తో విత్తనశుద్ధి చేయడం వల్ల దాదాపు 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు. నత్రజని ఎరువులను సరైన మోతాదులో సకాలంలో వేయాలి. పత్తిలో అంతర పంటలుగా పెసర, మినుము, సోయాచికుడు, ఆలసందలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగులు వృద్ధి చెంది కొంత వరకు రసం పీల్చు పురుగుల నియంత్రణకు దోహద పడుతాయి. కాండానికి ముందు పూసే పద్ధతిని పాటించాలి. కలుపు మొకలు చేను చుట్ట్టూ లేకుండా చూసుకోవాలి. మందుల పిచికారీతో పాటు పసుపు రంగు జిగురు పూసిన అట్టల ను(ఎల్లోస్టికీ ట్రాప్స్) ఎకరానికి 10 చొప్పున అమరిస్తే తెల్లదోమలు అకర్షించబడి జిగురుకు అంటుకొని చనిపోతాయి.
ఎర్రనల్లి, పిండినల్లి నివారణకు
ఎర్రనల్లి, పిండినల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటర్లు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు నీటికి కలుపుకొని మందులను మారుస్తూ పిచికారీ చేయాలి. ఫ్రొఫెలోఫాస్ 50 ఇ.సి. లేదా మిథైల్ పారాథియాన్ 50 ఇ.సి. 3 మి.లీ. లేదా ఎసిఫేట్ 2 గ్రా. + ట్రైటాన్ లేదా సాండోవిట్ లాంటి జిగురు మందులను 1మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి మొక పూర్తిగా తడిచేటట్లుగా పిచికారీ చేయాలి.లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్లు కలిపి వాడాలి.
కాయ తొలుచు, గులాబీ రంగు పురుగు నివారణకు..
కాయతొలుచు పురుగుల్లో శనగపచ్చ పురుగు, మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు ముఖ్యమైనవి. పైరు పెరుగుదలను, వాతావరణ పరిస్థితులను బట్టి ఒకోసారి ఒకోరకమైన పురుగు ఉధృతి ఎకువగా ఉంటుంది. ఎండాకాలంలో లోతు దుకులు చేసు కోవడం ద్వారా పురుగు కోశస్థ దశలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని నిల్వ చేయవద్దు. తకువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకొని సకాలంలో విత్తుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పత్తి పొలంలో కలుపు మొకలు, దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి.
తామర పురుగు నివారణకు..
తామర పురుగు సోకిన మొకలు గిడసబారి, పూలు, కాయలు రాలి దూది నాణ్యత తగ్గుతుంది. ఇవి ఎకువగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పత్తిని ఆశిస్తాయి. దీని వివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 యస్పి 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిలీ లీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిలీలీటర్లు, లేదా ట్రైజోఫాస్ 2 మిలీమీటర్లు లేదా డైఫెన్ థాయీరాన్ 1.25 గ్రాములు, లేదా స్ర్పైరోమెసిఫెన్ 1 మిల్లీమీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు పిచికారీ చేయాలి. వీటితో పాటు లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనెను 5 మిల్లీమీటర్లు కలిపి వాడాలి.
లింగాకర్షక బుట్టలు అమర్చాలి
పత్తి పంట విత్తిన 45 రోజుల నుంచి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. 10శాతం పురుగు ఆశించిన కాయలను గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే పురుగు ఉధృతిని నియంత్రించవచ్చు. పురుగు ఉధృతిని అంచనా వేసుకొని ఎకరాకు 4 కార్డుల ట్రైకోగ్రామా టాయి డియా బాక్ట్రే గుడ్డు పరాన్నజీవిని చేనులో వదలాలి. పంట తీసిన తర్వాత చేనులో గొర్రెలు, మేకలు, పశువులను మేపాలి. పత్తి మొదళ్లను భూమిలో కలియదున్నాలి. దుకిదున్నే దశ నుంచి చివరి దశ వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే పురుగు ఉధృతి తగ్గించు కొని అధిక దిగుబడులు సాధించవచ్చు.
– రామకృష్ణ, ఏఈవో