ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతున్నది. యథేచ్ఛగా రీసైక్లింగ్ దందా కొనసాగుతున్నది. మానుకోట మిల్లుల్లో పీడీఎస్ రైస్ను సన్నబియ్యంగా మార్చుతూ అక్రమార్కులు కోట్లకు పడుగలెత్తుతు న్నారు. ఈ అక్రమ దందాలో రేషన్ డీలర్లు, ఇల్లందు రహదారిలో ఏసీ గోదాం నడిపిన వ్యాపారే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని రేషన్ లబ్ధిదారుల నుంచి చోటా మోటా వ్యాపారులు బియ్యాన్ని కొని బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాకు ఆ శాఖకు సంబంధించిన ఓ అధికారి సహకరిస్తున్నట్లు విమర్శలు వినిపి స్తున్నాయి. ఈక్రమంలో ఇటీవల పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న లారీని కొందరు వ్యక్తులు పట్టుకుని రూ. లక్ష డిమాండ్ చేసి రూ. 25 వేలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నట్లు చర్చ నడుస్తోంది.
మహబూబాబాద్, సెప్టెంబర్ 21: ప్రభుత్వం నిరు పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లులకు తరలుతున్నా యి. ఈ అక్రమ దందాలో రేషన్ డీలర్లు, ఇల్లందు రహ దారిలో ఏసీ గోదాం నడిపిన వ్యాపారి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి సమీపం లో ఉన్న ఓ తండాకు చెందిన డీలర్, ఇతర డీలర్ల నుంచి చిన్న చిన్న రవాణా వాహనాల్లో బియ్యాన్ని తర లిస్తారు. సదరు ఏసీ గోదాం నడిపిన వ్యాపారితోపాటు గతంలో పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన వ్యాపారుల మిల్లులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి చేరిన బియ్యాన్ని సన్నబియ్యంగా రీసైక్లింగ్ చేసి దందా సాగిస్తున్నారు.
అధికారి అండదండలతో..
పట్టుబడిన వ్యాపారులకు సంబంధించిన రైస్ మి ల్లుల్లో రీసైక్లింగ్ దందా జోరుగా సాగుతోంది. కాగా, ఇ ల్లందు రహదారిలో ఓ గ్రామానికి సమీపంలోని మిల్లు లో వ్యాపారం చేసే మా‘ధ’వుడు అధికారుల సహకా రంతో అక్రమ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్క డికి చుట్టుపక్కల గ్రామాల నుంచి మినీ రవాణా వా హనాల్లో రేషన్ దందా చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అధికారి వీరికి అండదండలు అందిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమ వ్యాపారాల్లో పెద్దలు
పట్టణంలో ప్రముఖ సెంటర్లో ఓ బడా వ్యాపారి బియ్యం దందాలో కీలకంగా వ్యవహరిస్తూ వ్యాపారం సాగిస్తున్నారని సమాచారం. కొంతమంది రేషన్ లబ్ధి దారులు డీలర్ల నుంచి తీసుకెళ్లి చిన్న చిన్న వ్యాపారు లకు విక్రయిస్తే వారు బడా వ్యాపారులకు చేరవేసి జే బులు నింపుకుంటున్నారు. ఇటీవల ఇల్లందు బైపాస్ రోడ్డు నుంచి నర్సంపేట బైపాస్కు పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ లారీని కొందరు వ్యక్తులు ఆపి రూ. లక్ష డిమాండ్ చేయగా, రూ. 25 వేలిచ్చి సెటిల్మెంట్ చేసుకున్నట్లు చర్చ సాగుతోంది.