వరంగల్ చౌరస్తా, అక్టోబర్7: కాకతీయ సూప ర్ స్పెషాలిటీ హాస్పటల్లో త్వరలో అవయవ మా ర్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సెప్టెంబర్ 28న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి సృజన్, డాక్టర్ రితీష్ల ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రాంతానికి చెందిన వడ్డేపల్లి స్వప్న (31)కు కార్డియో థొరాసిక్ శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్ హార్ట్ సర్జరీ అనంతరం బాధితురాలు వైద్యుల పర్యవేక్ష ణలో పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీక రించారు. శుక్రవారం ఎంజీఎం సూపరింటెం డెంట్తోపాటు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ బాధితురాలి ఆరోగ్యస్థితిని పరిశీలించారు.
ఆమెకు తగిన సూచనలు చేసి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు త్వరలో నే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను సైతం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ మాదిరిగా ఉత్తర తెలంగా ణవ్యాప్తంగా పేదలకు వైద్యసేవలను అందించ డానికి ప్రభుత్వం సహాయ, సహకారాలు అంది స్త్తోందని అన్నారు. సర్కారు లక్ష్యాన్ని సాధించడా నికి తమ వైద్యుల బృందం సిద్ధంగా ఉంటుందని అన్నారు. తన ప్రాణాలు నిలిపిన వైద్యులకు స్వప్న కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్ట ర్ గోపాల్రావు, అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జునరెడ్డి, న్యూరో సర్జన్ డాక్టర్ నర్సింగరావు, డాక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎంఓ డాక్టర్ హీన, డాక్టర్ శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.