తాడ్వాయి, ఫిబ్రవరి 14: మేడారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొలగించాలని, లేకుంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మేడారం మహా జాతర ట్రస్ట్ బోర్డును ఆదివాసీలతో ఏర్పాటు చేయాలని అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా లంబాడీలు, గిరిజనేతరులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 11వ తేదీన ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రకటించినప్పటికీ దానిని రద్దు చేసి సేవాలాల్ జయంతి రోజున నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చే శారు.
ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలను జా తర ట్రస్ట్ బోర్డు నియా మకంలో విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. గతం లో జరిగిన ఘటనలు పునరావృతం కాక తప్పదని, 15వ తేదీన నియమించే ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేయాలని కోరారు. మంత్రి సీతక్క కూడా ఎన్నికల ముందు కమిటీలో పూర్తిగా ఆదివాసీలతో ట్రస్ట్ బోరు ను నియమిస్తామని చెప్పారని, మాట తప్పకుండా హామీ నెరవేర్చాలని సుమన్ కోరారు.