ఖిలావరంగల్, జనవరి 1 : కలెక్టరేట్లో నూతన సంవత్సర సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, పరిపాలనాధికారి శ్రీకాంత్ తహసీల్దార్లు, జిల్లా అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ బీ గోపికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. వివిధ శాఖలు, సంస్థలకు చెందిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ 2023 నూతన సంవత్సరంలో అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని సూచించారు. జిల్లాలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల రాంకిషన్, గాజె వేణుగోపాల్, ప్రతినిధులు హేమానాయక్, పాలకుర్తి సదానందం, జగదీశ్వర్, వేముల వెంకటేశ్వర్లు, ముళీధర్రెడ్డి, గద్దల రాజు, తోట చందర్, దుర్గారావు, ఇంద్రసేనారెడ్డి, మధు చంద్ర, రమాదేవి, రజిత, కిరణ్, సిద్ధంశెట్టి అనిల్, శుక్రుమియా, కవికుమార్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.