హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 19 : హనుమకొండలోని హరిత కాకతీయలో సహజమైన ఫైబర్ సిల్క్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి సిల్క్ ఉత్పత్తుల తయారీదారులు బనారస్, కాంచీపురం, బీహార్ టస్సర్, గుజరాత్, బంధిని, పటోలా, వెస్ట్బెంగాల్ బేలు, హ్యాండ్ పెయింటెడ్ శారీ, ఢాకాయి జందాని, పైథాని, చందేరి, ఇరి (అహింస) శారీ, శిబోరి, అజ్రక్ ప్రింట్, హ్యాండ్ కళంకారి, డ్రెస్ మెటీరియల్ ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 22 వరకు నేషనల్ సిల్క్ ఎక్స్పో ప్రదర్శన కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.