కురవి, ఫిబ్రవరి 10: జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు అనారోగ్యంతో మంచంపట్టాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన తుడుం ప్రశాంత్ కబడ్డీలో జాతీయస్థాయిలో రెండుసార్లు ఆడి విజేతగా నిలిచాడు. 1998 సంవత్సరంలో పంజాబ్లో జరిగిన 44వ నేషనల్ స్కూల్ గేమ్స్లో పాల్గొన్నాడు. 2000లో మధ్యప్రదేశ్లోని దేవాస్లో జరిగిన 45వ జాతీయస్థాయి స్కూల్గేమ్స్లో పాల్గొన్నాడు. 2018 డిసెంబర్ 17వ తేదీన అనారోగ్యానికి గురయ్యాడు.
ఆతర్వాత కొద్దిగా కోలుకుని నడుస్తున్న క్రమంలో 2022 నవంబర్ 27వ తేదీ మరోసారి కాలుచేయి కదల లేకపోవడంతో మంచానికి పరిమితమయ్యాడు. అప్పటికే లక్షలాది రూపాయలు అప్పు చేసి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. తాము దయనీయమైన స్థితిలో ఉన్నామని, భర్తను కాపాడుకునేందుకు దాతలు స్పందించి సహాయ సహకారాలు అందించాలని అతడి భార్య సుజాత కోరింది. సెల్ నంబర్ 9704610669కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆర్థికసాయం అందించాలని, ఖాతా నంబర్ ఎస్బీఐ, మహబూబాబాద్ అకౌంట్ నంబర్ 32764784045కు సహాయం చేయాలని కోరింది.