సుబేదారి, ఫిబ్రవరి 12 : కాకతీయ కెన్వాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి డాగ్ షో ఆకట్టుకుంది. పోటీలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 50 జాతులకు చెందిన 200 శునకాలు పాల్గొన్నా యి. ఇండోనేషియాకు చెందిన డానియల్క్వీ, సింగపూర్కు చెందిన కెల్విన్ పోటీలను ప్రారంభించి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఫిట్నెస్తో రాణించిన శునకాలను న్యాయ నిర్ణేతలు విజేతలుగా ప్రకటించి, ఆయా శునకాల యజమానులకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో కాకతీయ కెన్వాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కే రామస్వామి, ఉపాధ్యక్షుడు ప్రదీప్రెడ్డి, ప్రవీణ్, శునకాల యాజమానులు పాల్గొన్నారు.