నెక్కొండ, మార్చి 18 : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బానోత్ వెంకన్న, కాసోజు యాకాంబ్రచారి, గ్రామైక్యసంఘం అధ్యక్షురాలు శ్రీలత, మహిళలతోపాటు 30 కుటుంబాలకు చెందిన వారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాంచంద్రు, ఉపాధ్యక్షుడు రాంకోటి, మాజీ సర్పంచ్ మాలోత్ యాకు, మాజీ ఎంపీటీసీ సుగ్రీవ్, సొసైటీ డైరెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, మండల శాఖ అధ్యక్షుడు సంగని సూరయ్య, రెడ్లవాడ పీఏసీఎస్ చైర్మన్ జలగం సంపత్రావు, జడ్పీటీసీ లావుడ్యా సరోజాహరికిషన్ ఉన్నారు.