నర్సంపేట : బాలుడు అయిదు రూపాయల బిల్లతో ఆడుకుండూ మింగేశాడు. బాలుడికి అవస్థ ఏర్పడడంతో నర్సంపేటలోని ఈఎన్టి ఆస్పత్రికి తీసుకరాగా తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ మండల చింతనెక్కొండ గ్రామానికి చెందిన తూర్పాటి సరితయాదగిరి కుమారుడు నాని (3) బాలుడు ఆడుకుంటూ ఇంట్లో దొరికిన అయిదు రూపాయల నాణేన్ని నోట్లో పెట్టుకుని మింగాడు. అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే నర్సంపేటలో ఈఎన్టీ డాక్టర్ బీమగాని త్రినాథ్ దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆయన సూచన మేరకు ఎక్స్రే తీశారు.
అయిదు రూపాయల నాణెం గొంతుచివరలో శ్వాస నాళానికి మొదటగా ఉందని గుర్తించారు. డాక్టర్ సవేరా సహాయంతో బాలుడు మింగిన నాణేన్ని బయటకు తీశారు. దీంతో తల్లిండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బీమగాని త్రినాథ్ మాట్లాడుతూ చిన్నపిల్లలను నాణేలు, ఇనుపవస్తువులకు, మందు గోలీలకు దూరంగా ఉంచాలని సూచించారు.