నల్లబెల్లి, డిసెంబర్ 1: ఓటరు నమోదు ప్రక్రియలో వేగం పెంచాలని నర్సంపేట ఆర్డీవో శ్రీనివాసులు సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రైతు వేదికలో బూత్ లెవల్ అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. ఈ నెల 3, 4వ తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, సవరణలు, బీఎల్వోల రిజిస్టర్ తయారీ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమావేశంలో తహసీల్దార్ దూలం మంజుల, డీటీ కిరణ్కుమార్, ఆర్ఐ రాజేంద్రప్రసాద్, ఏఎస్వో అనిల్ పాల్గొన్నారు.
అర్హులందరికీ ఓటుహక్కు కల్పించాలి
నెక్కొండ: అర్హులందరికీ ఓటుహక్కు కల్పించేలా బీఎల్వోలు కృషి చేయాలని ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. నెక్కొండలోని రైతు వేదికలో తహసీల్దార్ డీఎస్ వెంకన్న, చెన్నారావుపేట తహసీల్దార్ బన్సీలాల్తో కలిసి ఆయన బీఎల్వోలతో సమీక్షించారు. ఓటరు కార్డుతో ఆధార్ను విధిగా అనుసంధానం చేయాలని సూచించారు. నెక్కొండ డీటీ రాజ్కుమార్, ఆర్ఐ నరేందర్ పాల్గొన్నారు.