డోర్నకల్, జనవరి 1: మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత పుట్టిన రోజు వేడుకలు డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నున్న రమణ, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కే కోటిలింగం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కే విద్యాసాగర్, కౌన్సిలర్లు సురేందర్ కుమార్ జైన్, పీ జనార్దన్, బీ శరత్ బాబు, చంద్రశేఖర్, బసిక అశోక్, మున్సిపల్ కో అప్షన్ సభ్యుడు రాంభద్రం, అజిత్మియా, మాజీ జడ్పీటీసీ సత్తిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు కొత్త వీరన్న, కందుల మధు, ఇంజం కృష్ణయ్య, ఏపూరి, ఎన్ శ్రీనివాస్, రహీమ్, మధు, కృష్ణ, లింగ స్వామి, కే వెంకటేశ్, బొబ్బల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
నర్సింహులపేటలో..
నర్సింహులపేట : ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్, రైతుబంధు జిల్లా సభ్యుడు తోట సురేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. బీఆర్ఎస్ నాయకులు టేకుల యాదగిరెడ్డి, ఎల్లు మధుసూదన్రెడ్డి, కాల్సాని దామోదర్రెడ్డి, రామన్న, రమేశ్ తదితరులు ఉన్నారు.
పీహెచ్సీలో పండ్ల పంపిణీ
నెల్లికుదురు : ఎంపీ మాలోత్ కవిత జన్మదిన వేడుకలను కవితక్క సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎర్రబెల్లిగూడెం సొసైటీ డైరెక్టర్ కొయ్యెడి వెంకటేశ్వరు ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బత్తిని అజయ్ గౌడ్, పొన్నం రాము, వరదోలు యాకయ్య, బదావత్ ప్రదీప్, ఆకుల మల్లేశ్, కొయ్యెడి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిపెడలో..
మరిపెడ : ఎంపీ మాలోత్ కవిత జన్మదినోత్సవాన్ని మున్సిపల్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక పీహెచ్సీలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్రావు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఎంపీ కవిత ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుడిని కోరుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు రామడుగు అచ్యుత్రావు, ఎంపీపీ గుగులోతు అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, గుగులోతు రాంబాబునాయక్, తేజావతు రవీంద్రనాయక్, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, డా రవి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తాళ్లపల్లి రాఘురామయ్య, రైతుబంధు జిల్లా సమితి సభ్యులు పానుగోతు వెంకన్న, దిగజర్ల శ్రీనివాస్, సయ్యాద్ లతీఫ్, మక్సుద్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరులో..
చిన్నగూడూరు : ఎంపీ మాలోత్ కవిత పుట్టిన రోజు సందర్భంగా ఉగ్గంపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.అనంతరం ఉగ్గంపల్లి నుంచి బైక్ ర్యాలీగా జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. కార్యక్రమంలో నాయకులు కొమిరెల్లి, మల్లేశ్, గంగరాజు, బిచ్చనాయక్, అంబరిష, జోసఫ్, వెంకన్న, యాకూబ్రెడ్డి, శ్రీపాల్ ఉన్నారు.