ప్రతి పల్లెకు పక్కా రోడ్ల నిర్మాణం
ఆదర్శంగా డోర్నకల్ నియోజకవర్గం
ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
చిన్నగూడూరు జూలై14: సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. డోర్నకల్ మండలానికి చెందిన శాంతికి రూ.25వేలు, జమాల్బేగానికి రూ.25 వేలు, కురవి మండలానికి చెందిన సురేశ్కు రూ.15 వేలు, దూప్సింగ్కు రూ.30 వేలు, నునావత్ మిక్కికి రూ.27వేలు, మరికొందరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా, గురువారం ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఉగ్గంపల్లిలోని తన నివాసంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. ఊరూరా తాగు, సాగునీరందించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసినట్లు తెలిపారు. ప్రతి పల్లె, గిరిజన తండాకు పక్కారోడ్లు నిర్మించి డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్రెడ్డి, రవికుమార్, మల్లెపాక మధు, నాగరాజు, రమేశ్, సందీప్, మల్సూర్, ఆయూబ్పాషా తదితరులు పాల్గొన్నారు.