వరంగల్చౌరస్తా, డిసెంబర్ 7: ఎమ్మెల్యే కొండా సురేఖకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం సంబురాలు నిర్వహించారు. వరంగల్ వెంకటరమణ జంక్షన్లో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా శాసన సభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు సందెల లాజర్, కూచన రవీందర్, జంగం ప్రభాకర్, గుల్లపల్లి రామకృష్ణ, జస్ప్రీత్ సింగ్, బోలుగొడ్డు శ్రీనివాస్, కొండమీది సదానందం, రాజేందర్, మహిళా నేతలు గూడ శారద, నహీమా, జహీరా, దేవసాని కీర్తి, యూత్ నాయకులు పాల్గొన్నారు.
స్వీట్లు పంచిన కాంగ్రెస్ నేతలు
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో శాయంపేటలో ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. బస్టాండ్ సెంటర్ వద్ద పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, నాయకులు పత్తి శ్రీనివాస్, రాజు, రఫి, సత్యం, కృష్ణమూర్తి, సుదర్శన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా సంగెం మండలంలోని చింతలపల్లిలో కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బండి రాధిక, పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇండ్ల శ్రీనివాస్, నాయకులు డి.వెంకటేశ్వర్లు, కుందారపు శ్రీను, రవీందర్, రబ్బాని, యుగేంధర్, రవి, బబ్లూ, సాయి, నవీన్, అభిలాష్, విక్రమ్, ప్రవీణ్, నితిన్, కొమురమల్లు, సమ్మయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సురేఖను కలిసిన నాయకులు
కరీమాబాద్/ఖిలావరంగల్: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆమెను మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్, మున్నూరుకాపు జిల్లా నాయకుడు బండి కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనాయత్ అక్తర్, దయ్యాల వీరేశం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొండా సురేఖను వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఖిలావరంగల్ సొసైటీ చైర్మన్ సంగరబోయిన చందర్, మెగా ఫ్యామిలీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్, శ్రీరాం రాజేశ్, చిట్టిమల్ల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం ప్రమాణస్వీకారానికి తరలిన నాయకులు
ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో చేసిన ప్రమాణస్వీకారానికి మండలంలోని ఆత్మకూరు, నీరుకుళ్ల, అక్కంపేట, పెద్దాపురం, చౌళ్లపల్లి, గూడెప్పాడ్, హౌసుబుజుర్గు గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరిలివెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, సర్పంచ్ పర్వతగిరి రాజు, పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్గౌడ్, మత్య్స పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బయ్య తిరుపతి, కాంగ్రెస్ నాయకులు బయ్య కుమారస్వామి, దుగ్యాల శ్రీను, బరుపట్ల కిరిటి, బరుపట్ల అయోధ్య, గుండెబోయిన శ్యామ్, మానగాని తిరుపతి, బయ్య నరేశ్, తన్గుల రామనుజన్, రమేశ్, ఉడుత రాజేందర్ పాల్గొన్నారు. దామెర మండలంలోని కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి హైదరాబాద్కు తరలివెళ్లారు. దామెర, ఊరుగొండ, పులుకుర్తి, ల్యాదెళ్ల, కోగిల్వాయి నుంచి వాహనాల్లో వెళ్లారు. తరలివెళ్లిన వారిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్రెడ్డి, పోలెపాక శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోశాలు, హింగె నాగేశ్వర్రావు తదితరులు ఉన్నారు.