హనుమకొండ, జూన్ 17: వరంగల్ పర్యటనకు శనివారం వచ్చిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు పలు సంఘాల నాయకులు వినతులు సమర్పించారు. హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ను సంఘం నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ కడిపికొండలో ఉద్యోగులకు కేటాయించిన స్థలం విషయాన్ని వివరించి, మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. కడిపికొండ స్థలాన్ని వెంటనే ఇప్పించాలని కోరారు. దీంతో మంత్రి కేటీఆర్ తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీజీవో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణరావు, టీఎన్జీవోస్ కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, జిల్లా కోశాధికారి పనికెల రాజేశ్, కేంద్ర సంఘం నాయకుడు శనిగరపు శ్యామ్సుందర్, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రవీణ్, భరత్, ప్రణయ్, అశోక్, రజిత పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో..
హనుమకొండ చౌరస్తా : రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని మంత్రి కేటీఆర్కు ఉథాట్స్, కేయూ జాక్ డెలిగేషన్ బాధ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రితో మాట్లాడి క్రమబద్ధీకరణ జరిగేల చూస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం బాధ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఉథాట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరి నిరంజన్, కేయూ జేఏసీ బాధ్యులు కర్ణాకర్రావు, డాక్టర్ ఫిరోజ్ పాషా, డాక్టర్ లింగయ్య, డాక్టర్ చిర్ర రాజు, కేయూ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సాదు రాజేశ్ పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో..
కాకతీయ యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్లో సీట్ల సంఖ్యను పెంచాలని కేయూ విద్యార్థి సంఘాల బాధ్యులు శనివారం మంత్రి కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు. సుమారు ఆరేళ్లుగా నోటిఫికేషన్లేక ఎంతో నష్టపోయామని, ప్రతి విభాగంలో పీహెచ్డీ సీట్ల సంఖ్య పెంచేలా వీసీని ఆదేశించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కేయూ విద్యార్థి సంఘాల కమిటీ నాయకులు మంద భాసర్, బీ నరసింహారావు, మంద నరేశ్, వడ్డేపల్లి మధు, బొట్ల మనోహర్, బొట్ల తేజ, మంద శ్రీకాంత్, మచ్చ పవన్కల్యాణ్, మధు గౌడ్, పవన్ గౌడ్, ధారవత్ సుధాకర్, చుక ప్రశాంత్ ఉన్నారు.