రాయపర్తి, జూన్ 5 : చదువుతోనే సబ్బండ వర్గాలకు సమాజంలో సమున్నత హోదా లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని రాగన్నగూడెం సర్పంచ్ రెంటాల గోవర్ధన్రెడ్డిని పరామర్శించారు. అనంతరం గట్టికల్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి గ్రామంలో నిర్వహిస్తున్న బడిబాట ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అత్యంత విలువైన సంపద విద్య అని అన్నారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.
‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, పూస మధు, కోదాటి దయాకర్రావు, కంది ప్రభాకర్, సరికొండ యాకూబ్రెడ్డి, విశ్వాస్రెడ్డి, నవల, పులుగు రాజిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఊకల్ గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఇలవేల్పు పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ కుంచారపు హరినాథ్, సొసైటీ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, యాదగిరిరెడ్డి, రంగయ్య, రావుల వెంకట్రెడ్డి, ఉపేందర్రెడ్డి, కేసాని వెంకట్రెడ్డి, గొల్లపల్లి సధాశ్రీను, నర్సింహుల రమేశ్, మల్లయ్య, చెవ్వ కాశీనాథం ఉన్నారు.
ఉపాధి కూలీలతో మాటామంతీ..
ఉపాది హామీ పథకం కూలీలకు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నట్లు మంత్రి జోస్యం చెప్పారు. గట్టికల్ గ్రామంలోని ఊర చెరువులో చేపల కుంటలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను కుశల ప్రశ్నలు అడిగి కాసేపు వారితో కలిసి గడ్డపారతో మట్టి తవ్వారు. మట్టి మోశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూలీలకు ఉచితంగా తట్ట, పార, గడ్డపారలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కూలీలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ఉచితంగా స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్ బ్యాగ్లను అందజేస్తామన్నారు. అనంతరం మండలంలోని కొండూరు గ్రామంలో బోనగిరి దేవేందర్, నేరేళ్ల దయాకర్, ఎనబోతుల అజయ్కుమార్ కుటుంబాలను కలిసి పరామర్శించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కర్ర రవీందర్రెడ్డి, చిర్ర ఉపేంద్ర, దేశగాని ఉపేందర్, ఆవుల కేశవరెడ్డి, పుల్లా ఎల్లాగౌడ్, కొమ్ము రాజు, గుగులోత్ సోమన్న, నేరేళ్లి రాములు, ఎనబోతుల శ్రీనివాస్రావు, విజయ్కుమార్ ఉన్నారు.