నల్లబెల్లి, డిసెంబర్ 3 : దివ్యాంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖగా ఏర్పాటు చేయడంపై దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు ఆధ్వర్యంలో నల్లబెల్లిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జన్ను జయరావు, వార్డు మెంబర్ పరికి నవీన్, పొడేటి కిశోర్, వీహెచ్పీఎస్ దుగ్గొండి, నల్లబెల్లి మండలాల అధ్యక్షులు పులి రమేశ్, చింత కుమారస్వామి, ఈదునూరి విజయ్, అనుముల నరేశ్, రమేశ్, ఆకుల మధు తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ : మండలంలోని మరియపురం గ్రామంలో సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ఆధ్వర్యంలో జీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి దివ్యాంగులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్మల, మేరీ పాల్గొన్నారు.
చేయూత అందించాలి..
పోచమ్మమైదాన్ : దివ్యాంగులకు చేయూత అందిస్తే వారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఎంఈవో విజయ్కుమార్ అన్నారు. మాసూం అలీ ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో దివ్యాగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిత కేంద్రంలో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో దివ్యాంగుల్లో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త కే సుభాశ్, మాసూం అలీ పాఠశాల హెచ్ఎం లచ్చిరాం నాయక్, ఫిజియోథెరపిస్టు మాధవి, ఐఈఆర్పీ సువర్ణ, సీఆర్పీ రమేశ్ పాల్గొన్నారు.
రాయపర్తి : దివ్యాంగులు అత్యంత ప్రతిభావంతులని తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బైరి సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎర్రబెల్లి గీతారావు అధ్యక్షతన దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. దివ్యాంగ అధ్యాపకుడు శ్రీనివాస్ను సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు నవీన్కుమార్, ప్రభాకర్, ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.