ఏటూరునాగారం, జనవరి 19: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 21న ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. సుమారు 20 వరకు కార్పొరేట్ కంపెనీలు సుమారు 2,530 ఉద్యోగాలు
రూ.10వేల నుంచి రూ.70వేల వరకు..
టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీలో డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ చదివిన 200 మందికి టెలీకాలర్స్, ప్రాసెస్ అసోసియేట్ ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. నెలకు రూ.15 నుంచి రూ.25వేల వేతనం ఇవ్వనున్నారు. విప్రో కంపెనీల్లో ఏదైనా డిగ్రీ చదివిన వారికి బ్యాక్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో రూ.15 నుంచి రూ.25వేల వేతనంతో 50 మందికి అవకాశం కల్పించనున్నారు. క్యాప్స్టన్ కంపెనీలో డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం, బీటెక్ చేసిన వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్గా 100 మందికి అవకాశం కల్పిస్తూ నెలకు రూ.12,500 నుంచి రూ.17వేల వరకు అందించనున్నారు. అపోలో ఫార్మసీ కంపెనీలో ఫార్మాసిస్టుగా పనిచేసేందుకు డీ ఫార్మసీ/బీ ఫార్మసీ/ఎంఫార్మసీ చదివిన 50 మందికి అవకాశం కల్పించనున్నారు.
నెలకు రూ.10,600 నుంచి రూ.20వేల వరకు చెల్లించనున్నారు. ట్రైనీ ఫార్మాసిస్టుగా 50మందికి రూ. 12,600నుంచి రూ.20వేల వరకు ఇవ్వనున్నారు. ఫార్మసీ అసిస్టెంట్ ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన 50 మందికి నెలకు రూ.11,600 నుంచి రూ.18వేల వరకు వేతనం ఇవ్వనున్నారు. రిటైల్ ట్రైనీ అసోసియేట్గా టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన 50మందికి నెలకు రూ.11,100 నుంచి రూ.16వేల వరకు వేతనం పొందే అవకాశం ఉంది. ప్రొడక్ట్ అడ్వయిజర్గా ఏదైనా డిగ్రీ చేసిన 50 మందికి రూ.10,600 నెలకు చెల్లించనున్నారు. కమ్యూనిటీ చాంపియన్, అడ్వయిజర్గా పనిచేసేందుకు ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ 50మందికి రూ.12,600 నుంచి రూ.15వేల వరకు వేతనం ఇవ్వనున్నారు. వరుణ్ మోటార్స్లో ఐటీఐ, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టెన్త్ చదివిన 50 మందికి ట్రైనీ టెక్నీషియన్గా ఉద్యోగ అవకాశం కల్పించి రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందించనున్నారు. ట్రైనీ సర్వీస్ అడ్వయిజర్గా 50మందికి బీటెక్, డిప్లొమా మెకానిక్ పూర్తిచేసిన వారికి నెలకు రూ.9వేల నుంచి రూ.12వేల వరకు ఇవ్వనున్నారు.
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 50మందికి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అవకాశం కల్పించి నెలకు రూ.11వేలు చెల్లించనున్నారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా డిగ్రీ, డిప్లొమా చేసిన 50 మందికి రూ.11వేలు నెలకు ఇవ్వనున్నారు. క్రీమ్ స్టోన్ కంపెనీలో టీం మెంబర్స్గా టెన్త్ చదివిన వారికి రూ.11వేల వేతనంతో 70 మందికి అవకాశం కల్పిస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసిన 30 మందికి రూ.14,500తో భోజన వసతి కల్పించనున్నారు. స్టోర్ మేనేజర్గా ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన పది మందికి రూ.25వేల నుంచి రూ.40వేల వరకు ఇవ్వనున్నారు. కేఎఫ్సీలో వంద మందికి పదో తరగతి, పైచదువులు ఉన్న వారికి నెలకు రూ.12వేలతోపాటు ఇన్సెంటివ్స్ అందించనున్నారు. ఫస్ట్ ఇన్ మ్యాన్ పవర్ సొల్యూషన్ కంపెనీలో ఫోన్ బ్యాంకింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఇంటర్ చదివిన వారికి రూ.12వేల నుంచి రూ.15వేల వేతనం ఇవ్వనున్నారు. జియో మెడ్హెల్త్ కేర్లో 50 మందికి మెడికల్ రిప్రంజంటేటివ్గా 50 మందికి రూ.15వేల నుంచి రూ.25వేలు పొందే అవకాశం ఉంది. పేపాల్ ట్రీ ఆన్లైన్ కంపెనీలో టెలీ కాలర్స్గా గ్రాడ్యుయేషన్ చేసిన 150 మందికి రూ. 13వేల నుంచి 14వేల వరకు రానున్నాయి. ఎటీఎం కస్టోడియన్గా ఇంటర్తో 250 మందికి 12వేలు ఇవ్వనున్నారు. ఎస్బీఐలో క్రెడిట్ కార్డు సేల్స్ మెన్గా డిగ్రీ పూర్తి చేసిన 50 మందికి రూ.13వేల వేతనం, హెచ్డీఎఫ్సీ సేల్స్ ఆఫీసర్గా డిగ్రీ పూర్తి చేసిన 50 మందికి రూ.15వేలు, పిక్కర్ అండ్ ప్యాకర్స్లో టెన్త్ చదివిన 50 మందికి రూ. 11వేల వేతనం చెల్లించనున్నారు.
సాఫ్ట్వేర్ డెవలపర్స్గా..
టెక్విష్ కంపెనీలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా ఏదైనా బీటెక్ పూర్తి చేసిన 40మందికి నెలకు రూ.20వేల నుంచి రూ.70వేల వరకు ఆఫర్ ఇస్తున్నా రు. ఫస్ట్సోర్స్ కంపెనీలో 15 మందికి సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేసేందుకు నెలకు రూ.15వేల నుంచి 30 వేలు, ట్రూఐడీ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా 20మందికి రూ.15వేల నుంచి రూ.30వేల వరకు అందించనున్నారు. మెడ్ప్లస్ కంపెనీలో డీఫార్మసీ, బీ ఫార్మసీ చేసిన 30మందికి రూ.17,750, టెన్త్ చదివిన 40మందికి సీఎస్ఏగా పనిచేసేందుకు రూ. 10,500, 20 మందికి జూనియర్ అసిస్టెంట్గా రూ.10,500, ఆడిట్ అసిస్టెంట్గా 15మందికి రూ.12వేల వేతనంతో అవకాశం కల్పించనున్నారు. హెటారో కంపెనీలో ప్రొడక్షన్ విభాగంలో బీఎస్సీ కెమిస్ట్రీతో 50మందికి నెలకు రూ. 22,500, మెయింటనెన్స్లో ఐటీఐ, ఫిట్టర్తో 20మందికి ఏడాదికి రూ.2.46లక్షలు, రిలయన్స్ రిటైల్లో ఫ్యాషన్ కన్సల్టేషన్, క్యాషియర్ టెన్త్తో 350 మందికి రూ.12వేలు, జీ4 సెక్యూరిటీ కంపెనీలో మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలీలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేందుకు 350 మందికి రూ.15,500 నుంచి రూ.20వేల వరకు అందించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు డీఆర్డీవో, ఎంపీడీవో, ఐకేపీ సిబ్బందితో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు.