కాజీపేట, మార్చి 24 : కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బల్లార్షా, విజయవాడ, భద్రాచలం రోడ్డు, సికింద్రాబాద్ సెక్షన్లో జరుగుతున్న రోలింగ్ కారిడార్ రైల్వే బ్లాక్ వర్క్స్ వల్ల ఆరు రైళ్లను రద్దు చేశారు. కాజీపేట-బల్లార్షా-కాజీపేట మధ్య నడిచే (17035/17036) అజ్నీ ప్యాసింజర్ రైలు, భద్రాచలం రోడ్డు-విజయవాడ- భద్రాచలం రోడ్డు మధ్య నడిచే (07278/07279) ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్- వరంగల్, వరంగల్-హైదరాబాద్ (07462/07463) మధ్య నడిచే పుష్పుల్ రైలును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.