కృష్ణకాలనీ, డిసెంబర్ 25: యేసుక్రీస్తు ఆశీస్సులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఆదివారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేంద్రంలోని సీఎస్, కల్వరి, కల్వరి ప్రేమ మినిస్ట్రీ, సియోను పర్వమందిరం, బేతెస్థ కల్వరి మందిరం, మంజూర్నగర్లోని సియోను ప్రార్థన మందిరంతోపాటు పలు చర్చిల్లో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, బీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్థన్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, కౌన్సిలర్లు సజ్జనపు స్వామి, శిరుప అనిల్, మంగలపెల్లి తిరుపతి, నూనె రాజు, జక్కం రవికుమార్, రవీందర్, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ కమల, భూపాలపల్లి మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పైడిపెల్లి రమేశ్, కరీం, బీబీచారి, పిల్లల మర్రి నారాయణ, అశోక్, ప్రేమ్, ముత్తు, ఆయా చర్చిల ఫాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
అన్ని మతాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం ;జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
వెంకటాపూర్ : అన్ని మతాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. మండలంలోని కర్నూల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్తోపాటు గ్రంథాలయ జిల్లా చైర్మన్ గోవింద్ నాయక్ హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని మతాల సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, జడ్పీటీసీ గై రుద్రమదేవి అశోక్, డీసీసీబీ డైరెక్టర్ మాడుగుల రమేశ్, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్లు, సీనియర్ నాయకులు మల రమేశ్, మండల ప్రధాన కార్యదర్శి మల్లయ్య, మండల, గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు.