హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 18 : హైదరాబాద్కు చెందిన హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కేయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య ఆర్య, అనంత మాధవమోహన్, మురళీధర్రావు, ఎస్వీ రమణన్, వరప్రసాద్, శారద అవగాహన ఒప్పందాలు మార్చుకున్నారు. కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, రామచంద్రం, నరసింహాచారి, ప్రసాద్, కోలా శంకర్ పాల్గొన్నారు.